*
ప్రశ్న ఆయుధం న్యూస్ డిసెంబర్ 14 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి
తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ స్వర్గీయ మోరే భాస్కర్ సంతాప సభలో పాల్గొని ఘనంగా నివాళులర్పించిన ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్
ప్రత్యేక తెలంగాణ మలిదశ ఉద్యమంలో, క్రియాశీలక పాత్ర వహించి, ఉద్యమమే ఆశగా ధ్యాసగా ఊపిరిగా భావించి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎన్నో త్యాగాలు చేసినటువంటి , గొప్ప తెలంగాణ పోరాట యోధుడు, దళిత రంగంలో కూడా ఎనలేని సేవలందించి, అటు కొత్తగూడెం మున్సిపాలిటీ అభివృద్ధిలో కూడా భాగస్వామ్యాన్ని వహించిన మాజీ మున్సిపల్ కౌన్సిలర్ స్వర్గీయ మోరే భాస్కర్ ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకుడని మార్గదర్శకుడైన నాయకుడని,
వారి భార్య ఇద్దరు కుమారులకు, వారి కుటుంబానికి ప్రతి ఒక్కరూ అండగా నిలబడాలని, భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మరియు అభ్యుదయ కళా సేవా సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు,కవి సినీగీత రచయిత గాయకులు, సమాజసేవకులు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ ఉద్ఘాటించారు
14-12-2024 నాడు స్థానిక రామవరం వద్ద గల వారి స్వగృహంలో, ఇటీవల హృద్రోగంతో అకాల మరణం చెందిన స్వర్గీయ మోరే భాస్కర్ యొక్క సంతాప సభలో ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ తన బృందంతో, పాల్గొని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు
వారి సంతాప సభలో పాల్గొని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి మరియు దళిత రంగానికి జాతీయ ట్రేడ్ యూనియన్ నాయకులు గొల్లపల్లి దయానందరావు , జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు అంతోటి పాల్, మోరే రమేష్ , సింగరేణి ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి అంతోటి నాగేశ్వరరావు, సింగరేణి ఐఎన్టియుసి కార్పొరేట్ నాయకులు రజాక్ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు పూల రవీందర్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొప్పరి నవతన్, అపరబాలు అల్లి శంకర్ , బిఆర్ఎస్ నాయకులు మంతపురి రాజు గౌడ్ , బండి రాజు గౌడ్, హుస్సేన్, అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు మద్దెల సాయి సుధీర్, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగ సీతారాములు, సొసైటీ చైర్మన్ మండ వీర హనుమంతరావు, బిఆర్ఎస్ నాయకులు కాన్సిరాం , విశ్వవిఖ్యాత టైక్వాండో క్రీడాకారిణి సింధు తపస్విని, అభ్యుదయ కళాకారుడు మరియు అంబేద్కర్ వాది సిద్దెల రవి
సీనియర్ తెలంగాణ ఉద్యమ నాయకులు తాళ్లూరి వెంకటేశ్వరరావు, మల్లెల రామనాథం, లగడపాటి రమేష్, రషీద్ భాయ్, బాలాజీ
తొగరు రాజశేఖర్, పి సురేందర్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
మోరే భాస్కర్ కు సంతాప కార్యక్రమానికి హాజరైన మద్దెల*
