సమగ్ర శిక్ష ఉద్యోగుల మహా పాదయాత్ర
ప్రశ్న ఆయుధం -కామారెడ్డి
కామారెడ్డి జిల్లా విద్యాశాఖ సమగ్ర శిక్ష ఉద్యోగులు నిరవధిక సమ్మెలో భాగంగా 19వ రోజు కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం నుంచి అమరవీరుల స్తూపం వరకు ఐదు కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేసి వారు తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి సంపత్ లు మాట్లాడుతూ హనుమకొండ ఏకాశిల పార్క్ వద్ద ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, తెలంగాణ రాష్ట్రం అంటేనే త్యాగాల పురిటి గడ్డ అని, మేము తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన కాంట్రాక్టు ఉద్యోగులము అన్నారు.
కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సంపత్ మహిళా అధ్యక్షురాలు వాసంతి,నాయకులు శ్రీధర్ రాములు, శైలజ,సంతోష్ రెడ్డి వనజ,మంగా, శ్రీవాణి, కళ్యాణ్,సంధ్య,లింగం, కృష్ణ,దినేష్,వీణ, లావణ్య 500 మంది సభ్యులు పాదయాత్రలో పాల్గొన్నారు