Site icon PRASHNA AYUDHAM

అర్హులైన పేదలను గుర్తించి డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలని తాసిల్దార్ కి వినతి పత్రం….

పత్రం
Headlines
  1. భద్రాచలం లో అర్హులైన పేదలకు డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలని మహాజన మహిళా సమైక్య డిమాండ్
  2. మహాజన మహిళా సమైక్య వినతి పత్రం: డబల్ బెడ్ రూమ్ ఇళ్ళు అర్హులైన పేదలకు ఇవ్వాలి
  3. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై మహాజన మహిళా సమైక్య తీవ్ర ఆగ్రహం
  4. భద్రాచలం లో 88 డబల్ బెడ్ రూమ్ ఇళ్లలో అర్హులైన పేదలకు అన్యాయం, మహాజన మహిళా సమైక్య ఆరోపణ
  5. పేదలకు సొంత ఇల్లు ఇవ్వడంలో ప్రభుత్వ చర్యలపై మహాజన మహిళా సమైక్య పోరాటం
మహాజన మహిళా సమైక్య ఆధ్వర్యంలో అర్హులైన పేదలను గుర్తించి డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలని తాసిల్దార్ కి వినతి పత్రం….

 భద్రాచలం స్థానిక తాసిల్దార్ కి అర్హులైన పేదలను గుర్తించి డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలని మహాజన మహిళా సమైక్య ఆధ్వర్యంలో వినతిపత్రం అందించడం జరిగింది. ఈ సందర్భంగా మహాజన మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు మేకల లత మాట్లాడుతూ గత కెసిఆర్ ప్రభుత్వం భద్రాచలం పట్టణంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ 88 ఇళ్ల విషయంలో పేదలకు అన్యాయం జరిగిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా అర్హులైన పేదలకు మరోసారి అన్యాయం జరిగిందని,రాజకీయ పార్టీల, ప్రజాప్రతినిధుల చెప్పు చేతల్లో ప్రభుత్వ అధికారులు ఉంటే పేదలకు సొంత ఇంటి కలగానే మిగిలిపోతుందని ఆవేదన వ్యక్తపరిచారు. ప్రభుత్వ అధికారులు ఏ విధంగా ఎంక్వయిరీ చేసి డబల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారులని ప్రకటన చేస్తారో బహిర్గతం చేయాలని అన్నారు. వరద ముంపు బాధితులకు డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వడంలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వానికి పేదల పట్ల చిత్తశుద్ధి ఉంటే 250 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పూర్తి చేసి అప్పుడు డబల్ బెడ్ రూమ్ ఇళ్ల అర్హుల లిస్టు ని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మహాజన మహిళా సమైక్య ఆధ్వర్యంలో ప్రజాసంఘాలు కలుపుకొని ప్రజా పోరాటం చేస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాదిగ మహిళా సమైక్య జిల్లా ఉపాధ్యక్షురాలు కొప్పుల నాగమణి, జిల్లా కార్యదర్శి గద్దల కృష్ణవేణి, మహజన మహిళా సమైఖ్య జిల్లా ఉపాధ్యక్షురాలు కొచ్చర్ల కుమారి, పట్టణ నాయకులు ఎస్.కె రహిమ, రావుల నిర్మలమ్మ, మేరీ, బానోత్ స్వాతి, లక్ష్మి, వేముల దుర్గ, దుబ్బల కళావతి, బుర్ర నాగలక్ష్మి, ఉష, దేవి, అనిత తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version