మహాలయ అమావాస్య ప్రత్యేకత
— పూర్వీకుల శాంతి కోసం పవిత్ర తర్పణాలు
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
(ప్రశ్న ఆయుధం )సెప్టెంబర్ 21
భాద్రపద మాసంలోని అమావాస్య రోజున జరుపుకునే మహాలయ అమావాస్యను హిందువులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఈ రోజు పితృ తర్పణం, పిండప్రధానం చేసి పూర్వీకులను స్మరిస్తారు. ఎవరి పూర్వీకులు ఏ తిథిలో మరణించారో తెలియకపోయినా ఈ రోజున శ్రద్ధ కర్మలు చేస్తే సంవత్సరం మొత్తం ఫలితం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. పితృ దోష నివారణ, కుటుంబ సుఖసంతోషాల కోసం ఈ తర్పణాలు దోహదపడతాయని పండితులు పేర్కొంటున్నారు. స్నానం అనంతరం నువ్వులు, బియ్యంతో తర్పణం చేసి, శ్రద్ధ పూర్తయ్యాక ఉపవాసం విరమిస్తారు. పేదవారికి అన్నదానం, వస్త్రదానం చేస్తే పితృ దేవతల ఆశీర్వాదం లభిస్తుందని నమ్మకం.