ప్రశ్న ఆయుధం న్యూస్ డిసెంబర్ 22 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమాజంలో బీసీల అభివృద్ధిని ఆత్మగౌరవాన్ని రాజకీయ అధికారాన్ని సాధించుకొనుటకు విద్యార్థికి బడిలాగా,భక్తుడికి గుడిలాగా,మనకు ఒక కార్యాలయం అవసరం ఉన్నందున
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో రాజకీయ పార్టీలకు అతీతంగా బీసీ సంఘాలన్నీ కలిసి బీసీ కులాల ఐక్యవేదిక జిల్లా కార్యాలయాన్ని ఈనెల 24 వ తారీకు మంగళవారం సాయంత్రం3 గంటలకు
కొత్తగూడెం బస్టాండ్ నుండి పోస్ట్ఆఫీస్ సెంటర్కు వెళ్ళు మార్గంలో పెట్రోల్ బంకు పక్కన ప్రారంభించుతున్నాము. కావున ప్రతి ఒక్క బీసీ మిత్రుడు మీ మీ బీసీ మిత్రులతో కలిసి బాధ్యతగా పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము.
కార్యాలయ ప్రారంభకులు
చిరంజీవులు రిటైర్డ్ ఐఏఎస్ బిసి ఇంటలెక్చువల్ ఫోరం వ్యవస్థాపకులు.
ఇనుకొండ తిరుమలి ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్.
సంగెం సూర్యారావు సీనియర్ జర్నలిస్టు.బీసీ సమాజ్ వ్యవస్థాపకులు.
మల్లెల రామనాథం తెలంగాణ జన సమితి పార్టీ రాష్ట్ర కార్యదర్శి.
ఆహ్వానకమిటి నాయకులు
బొడ్డుపెళ్లి సత్యనారాయణబిసి,
మిట్టపల్లి సాంబయ్య బిసి,
చిటికెన ముసలయ్య బిసి , కురిమెళ్ళ శంకర్ బిసి,
కాసోజు రామాచారి బిసి.
పల్లపు లక్ష్మణ్ బిసి కౌన్సిలర్. తాళ్లూరి సత్యనారాయణ బీసీ, నాజర్ హైమద్ బిసి,
మెట్టెల సైదిబాబు బిసి, ఉబ్బనపల్లి కాశయ్య బిసి
తదితరులు పాల్గొంటున్నారు కావున ప్రతి ఒక్క బీసీ బిడ్డ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు మహంకాళి రామారావు ఒక ప్రకటనలు తెలియజేశారు.