మహారాష్ట్ర,జార్ఖండ్ అసెంబ్లీ,లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం తేదీలు ప్రకటించింది. మహారాష్ట్రలో నవంబర్ 20న ఒకే విడతలో ఎన్ని కలు నిర్వహించి నవంబర్ 23న ఓట్ల లెక్కింపు చేపట్టి ఎన్నికల ఫలితాలు వెల్లడించనున్నట్లు ఎన్నికల సంఘం స్పష్టంచేసింది. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ను రెండు విడతల్లో నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. నవంబర్ 13న జార్ఖండ్ తొలి విడత ఎన్నికలు జరగనుండగా, 20వ తేదీన రెండో విడత ఎన్నికలు పూర్తి చేయనున్నారు. నవంబర్ 23న జార్ఖండ్ ఓట్ల లెక్కింపు చేపట్టను న్నారు. అంటే ఒకే రోజు మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో అధికారం ఎవరిదో తేలిపోనుందన్న మాట. మహారాష్ట్రలో ప్రస్తుత పరిస్థితి.. మహారాష్ట్రలో ప్రస్తుతం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివ సేన, బీజేపి, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ పార్టీలు కూటమిగా ఏర్పడి రాష్ట్రాన్ని పరిపాలిస్తు న్నాయి. కాంగ్రెస్ పార్టీ, ఉద్ధవ్ థాకరే నేతృత్వం లోని శివ సేన, శరద్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీ పార్టీలు ప్రతిపక్ష కూటమిగా ఉన్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్టీలు ఇలాగే కూటమిగా కలిసి సీట్లు పంచుకుని పోటీ చేస్తాయా లేక సీట్ల పంపకాల విషయంలో ఏకాభిప్రాయం లేక విడివిడిగానే పోటీ చేయాల్సి వస్తుందా అనేది తెలియాల్సి ఉంది.