Site icon PRASHNA AYUDHAM

సుజాత నగర్ కు మహర్ధశ తెచ్చారు

IMG 20250108 WA0043

ఎమ్మెల్యే కూనం నేని కి మండల వాసులు సన్మానం

జనవరి..08 ప్రశ్న ఆయుధం సుజాతనగర్ మండల ప్రతినిధి ఎస్కేఅజ్జు
సుజాతనగర్ మండలాన్ని చరిత్ర పుటల్లో ఎక్కించారని సుజాత నగర్ మండల వాసులు ఎమ్మెల్యే కూనం నేని ను కీర్తించారు.మంగళవారం కొత్తగూడెం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో మండల రైతులు సుజాత నగర్ ను కార్పొరేషన్ లో కలిపి నందుకు ఘనం గా సన్మానించారు .ఈ సందర్భంగా గా ఎమ్మెల్యే మాట్లాడుతూ నా కల నెరవేరింది అన్నారు.
కొత్తగూడెం కు ఎయిర్ పోర్ట్ తో పాటు కార్పొరేషన్ రావడం చాలా సంతోషంగా వుందని అన్నారు.సుజాత నగర్ మూడవ సిటీ కాబోతుందని అన్నారు.భవిష్యత్ లో భూములు,ఆస్తులు విలువ పెరుగుతాయన్నరు.కార్పొరేషన్ వల్ల మార్కెటింగ్ తో పాటు ఉపాధి అవకాశాలు పెరుగు తాయన్నరు.రానున్న రోజుల్లో పెద్దమ్మ తల్లి గుడి నుండి లక్ష్మీదేవి పల్లి,చుంచు పల్లి మండలాలు కార్పొరేషన్ లో కలుపు తానన్నరు.గిరిజన చట్టాలు దీనికి అడ్డురావని అన్నారు.కార్పొరేషన్ కావద్దనికి నాకు సహకరించిన కాంగ్రెస్ ముగ్గురు మంత్రులకు అభినందనలు చెప్తానని అన్నారు.
ఈ సన్మాన కార్యక్రమం లో స్థానిక రైతులు
లక్ష్మీనారాయణ మూడ్ గణేష్మన్నేపల్లి.రవి కీసర బ్రహ్మానందం రెడ్డితాళ్లూరి పాపారావుధర్మారావుకేహన్మంతు రావు,నడి కట్టు రోసి రెడ్డితదితరులు పాల్గొన్నారు.

Exit mobile version