Headlines :
-
మహిళా శక్తి భవనాల స్థల పరిశీలన: కలెక్టర్ జితేష్ పాటిల్
-
భద్రాద్రి కొత్తగూడెంలో రూ. 5 కోట్లతో మహిళా శక్తి భవనాల నిర్మాణం
-
స్వయం సహాయక సంఘాలకు మద్దతుగా మహిళా శక్తి భవనాలు
-
మహిళా శక్తి భవన సముదాయాలకు కలెక్టర్ ఆదేశాలు
ప్రశ్న ఆయుధం న్యూస్ డిసెంబర్ 7 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి
మహిళా శక్తి భవన సముదాయాల నిర్మాణం కోసం లక్ష్మీదేవిపల్లిలోని ఇల్లందు క్రాస్ రోడ్ లో కేటాయించిన స్థలాన్ని శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీర్ శ్రీనివాస్ రావును అక్కడ చేపట్టబోయే నూతన భవన నిర్మాణ అంచనాలను అడిగి తెలుసుకున్నారు. మహిళా శక్తి భవనాలకు రూ 5. కోట్ల వ్యయ అంచనాలను రూపొందించినట్లు తెలిపారు. అత్యంత విశాలమైన భవనాన్ని ఏర్పాటు చేయాలని అధికారుల ఆదేశించారు. మహిళా శక్తి భవనాలు అందుబాటులోకి వస్తే స్వయం సహాయక సంఘాలకు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. కలెక్టర్ వెంట పంచాయతీ రాజ్ ఏఈ శివలాల్,సిబ్బంది శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.