మాలల మహా పాదయాత్రను విజయవంతం చేయండి..

విజయవంతం
మాలల మహా పాదయాత్రను విజయవంతం చేయండి..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి
ప్రశ్న ఆయుధం అక్టోబర్ 22:

ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ జాతీయ మాలమహనాడు రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు పిల్లి సుధాకర్ ఈనెల 25 వ తేదీన భద్రాచలం నుండి పాదయాత్ర చేయడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. 16 జిల్లాలో 35 నియోజకవర్గాల్లో డిసెంబర్ 1 వరకు పాదయాత్ర చేయడానికి ముందుకు వచ్చారు. అలాగే డిసెంబర్ 1 నాడు హైదరాబాదులో మాలల మహా సంగ్రమ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి జిల్లా నుండి మాల సోదరులకు పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. మాల, మాల ఉపకులాల వర్గీకరణను వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. తెలంగాణ ముఖ్యమంత్రి వర్గీకరణ కోసం ప్రత్యేక కమిటీని నియమించడం జరిగింది. ముఖ్యమంత్రి ఈ కమిటీని వెంటనే రద్దు చేయాలని లేకపోతే మీ కమిటీని అలాగే మిమ్మల్ని కూడా అడ్డుకోవడం జరుగుతుంది. అనుభవం లేని ముఖ్యమంత్రి మీకు దమ్ముంటే హైకోర్టు సిట్టింగ్ జడ్జి మరియు మాల మేధావులతో కమిటీలు ఏర్పాటు చేయాలని మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు ఎడ్ల రాజు డిమాండ్ చేశారు. మీరు ముందుగా కులగనన చేయండి. ఎవరి నిష్పత్తి ఎంత ఉంది అని ఆలోచించి నేనేం తీసుకోవాల్సిందిగా మరోసారి హెచ్చరిస్తున్నాము. అసలు రాష్ట్ర ప్రభుత్వాలకు ఎస్సీ వర్గీకరణ చేసే హక్కు లేదు. పరిపాలన మీద అవగాహన లేని ముఖ్యమంత్రి ఎస్సీ వర్గీకరణ మీద వేసిన కమిటీని వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుచున్నాము. లేనిచో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం త్వరలోనే మాలలు అంటే ఏందో తెలుసుకుంటారని మాల మహానాడు రాష్ట్ర సభ్యులు ఎడ్ల రాజు పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now