ఉరేసుకొని వ్యక్తి మృతి..
కామారెడ్డి జిల్లా చందూర్
ప్రశ్న ఆయుధం అక్టోబర్ 21:
మద్యానికి బానిసయి ఆత్మహత్య చేసుకున్న ఘటన చందూర్ మండలకేంద్రంలో ఏర్పడింది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మడిగావ్ సంజీవ్ తండ్రి ఆశన్న 45 సంవత్సరాలు కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లా చిక్లీ గ్రామానికి చెందిన వ్యక్తి భార్య పిల్లలను వదిలేసి ఊరురా తిరుగుతూ టైలరింగ్ పని చేస్తూ జీవనం కొనసాగిస్తూ మద్యానికి బానిసయి అదేపనిగా నెలరోజులు గా చందూర్ గ్రామంలోని హన్మాండ్లు టైలర్ వద్ద బట్టలు కుట్టు పని చేస్తూ హన్మాండ్లు వద్ద కిరాయి గదిలో నివాసం ఉంటున్నాడు ఆదివారం నాడు పని ముగించుకొని తన కిరాయి గదికి మద్యం సేవించి వెళ్లి ఒంటరితనంతో ఉండే జీవితం పై విరక్తి చెంది మద్యం మత్తులో గదిలోని ఇనుప పైపుకు నైలాన్ తాడుతో ఉరివేసుకొని చనిపోయాడని అతని తమ్ముడు విజయ్ కుమార్ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఉమ్మడి వర్ని మండల ఎస్సై తెలిపారు.