Site icon PRASHNA AYUDHAM

తొలి మహిళ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ జయంతి నిర్వహించిన మండల కాంగ్రెస్ నాయకులు

IMG 20241119 WA0185

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భారతదేశ తొలి మహిళా ప్రధాని స్వర్గీయు ఇందిరా గాంధీ జయంతి వేడుకలు నిర్వహించిన మండల కాంగ్రెస్ నాయకులు.

ఈరోజు భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ఆదేశాల మేరకు భారత దేశ‌ మొదటి మహిళా ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన మండల కాంగ్రెస్ నాయకులు.

మండల నాయకులు రత్నం రమాకాంత్ మాట్లాడుతూ

మహిళా శక్తికి మార్గదర్శిగా నిలిచిన మహోన్నత నాయకురాలు ఇందిరా గాంధీ.

పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం ఎన్నో చట్టాలను తెచ్చి వారికి బాటలు వేసిన ఇందిరా గాంధీ.

ఇందిరాగాంధీ 107 వ జయంతి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా వారి సేవలను, ఆ కుటుంబం చేసిన త్యాగాలను గుర్తు చేసుకుంటున్నారు.

గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియను మొదలు పెడుతున్న విషయాన్ని గుర్తు చేశారు.

*గతంలో ఇందిరమ్మ పేరుమీద ఏ పథకం ప్రారంభించినా కూడా పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసమే విజయవంతం జరిగింది అన్నారు.

ఈ కార్యక్రమంలో మండల నాయకులు రత్నం రమాకాంత్, బొంబోతుల రాజీవ్, అరికెల తిరుపతిరావు, పెద్దినేని శ్రీనివాస్, నర్రా రాము, భీమవరపు వెంకటరెడ్డి, చెగోండి శ్రీనివాస్, మామిడి పుల్లారావు, కాపుల శ్రీను, తాంబళ్ల కృష్ణార్జున రావు, యూత్ నాయకులు పుల్లగిరి నాగేంద్ర, జమిర్, మహిళలు మానే కమల, కేతినేని లలిత, బోడ మణి, సత్యావణి తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version