ప్రశ్న ఆయుధం న్యూస్ మార్చి 15 కొ
త్తగూడెం డివిజన్ ఆర్ సి
భద్రాచలం ఐటీడీఏ పీవో బి రాహుల్ కి వినతి పత్రాన్ని అందజేశారు.
మణుగూరు మండలం సర్వాయి గుంపు,పెద్దిపల్లి ఆదివాసి గ్రామాలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో సోమవారం భద్రాచలం ఐటిడిఏ కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో బి రాహుల్ కి వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా గోదావరిలోయ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి యస్ డి నా సర్ పాషా మాట్లాడుతూ ఆదివాసీలు మణుగూరు మండలం కూనవరం గ్రామపంచాయతీ పరిధిలోని రేగుల గండి చెరువు సమీపంలో నివసిస్తున్న సర్వాయి గుంపు ఆదివాసి గ్రామంలో, మరియు సింగరేణి నిర్వాసిత పెద్దిపల్లి గ్రామంలో త్రాగునీరు రహదారి విద్యుత్ సౌకర్యం లేక పిల్ల పాపలతో చాలా ఇబ్బంది పడుతున్నారని అన్నారు. కూనవరం గ్రామం నుండి రేగుల గండి చెరువు పంట కాలువ పక్కనుండి సమాంతరంగా సర్వాయి గుంపు వరకు మట్టి రోడ్డు ఉన్నప్పటికీ గుంతలుగా వాహనాల ప్రయాణానికి అసౌకర్యంగా ఉన్నదన్నారు. దయచేసి రోడ్డు అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని మనవి చేస్తున్నామన్నారు. అదేవిధంగా ఓ సి,-4 సింగరేణి నిర్వాసిత గ్రామమైన పెద్దిపల్లి ఆదివాసి గ్రామానికి కూడా త్రాగునీటి కటకట ఎదురవుతుందన్నారు. సింగరేణి సామాజిక బాధ్యతలో భాగంగా ఏర్పాటుచేసిన సోలార్ విద్యుత్తు త్రాగునీటి బోర్లు మరమ్మత్తులకు గురయ్యాయని ఐటీడీఏ సంస్థ స్పందించి త్రాగునీటి వసతి కల్పించే విధంగా సింగరేణి యాజమాన్యానికి తగు ఆదేశాలు జారీ చేయాలను కోరారు. అదేవిధంగా ఐ టి డి ఆధ్వర్యంలో రహదారులు విద్యుత్ సౌకర్యం పాఠశాల భవన నిర్మాణం చేపట్టాలని కోరారు. ఆదివాసి గ్రామాలకు కుల ధ్రువీకరణ పత్రాలు ఇచ్చే విధంగా ప్రభుత్వం స్పందించాలని కోరారు. సత్వరమే ఆదివాసి గ్రామాలకు త్రాగునీటి ఏర్పాటుకు తగు చర్యలు చేపడతామని పిఓ గారు హామీ ఇవ్వడం పట్ల ఆయన కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పి ఓ డబ్ల్యు భద్రాచలం డివిజన్ ప్రధాన కార్యదర్శి సున్నం భూలక్ష్మి, ఆదివాసీలు కల్తీ చుక్కయ్య, బాడిస రాంబాబు, పి ఓ డబ్ల్యూ భద్రాచలం డివిజన్ కమిటీ సభ్యురాలు మరల కృపారాణి, బండ్ల కమలమ్మ సోడే అచ్చమ్మ,తదితరులు పాల్గొన్నారు.