కీసర కేసరి హాస్పిటల్‌లో అవకతవకలు… మూడు ప్రాంతాల్లో ఫేక్ బ్రాంచుల నిర్వహణ

**కీసర కేసరి హాస్పిటల్‌లో అవకతవకలు… మూడు ప్రాంతాల్లో ఫేక్ బ్రాంచుల నిర్వహణ**

మేడ్చల్ జిల్లా కీసర ప్రశ్న ఆయుధం జూన్ 28

కీసరలోని ప్రముఖ కేసరి హాస్పిటల్ నిర్వహణలో తీవ్రమైన అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. అదే హాస్పిటల్ పేరుతో, అదే డాక్టర్లు మరియు పారామెడికల్ సిబ్బంది వివరాలను ఉపయోగించి, నాగారం ప్రాంతంలో రెండు క్లినిక్‌లు, కీసరాలో ఒక పోలీ క్లినిక్ నడుపుతున్నట్లు అధికారులు గుర్తించారు.

ఈ విషయాన్ని గమనించిన జిల్లా వైద్య ఆరోగ్యాధికారి డా. సి. ఉమా గౌరీ హాస్పిటల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీల్లో క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్‌కు విరుద్ధంగా అనేక నిబంధనలు ఉల్లంఘించబడినట్లు గుర్తించారు. దాంతో పాటు, హాస్పిటల్‌కు వెంటనే షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు ఆమె తెలిపారు.

**కఠిన చర్యలు తప్పవు:**

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్, పీసీపీఎన్‌డీటీ యాక్ట్ లేదా ఎంటీపీ యాక్ట్ ఉల్లంఘిస్తూ నడుస్తున్న హాస్పిటల్స్, క్లినిక్స్, ల్యాబ్స్ మరియు డయాగ్నొస్టిక్ సెంటర్లపై కఠిన చర్యలు తప్పవు” అని హెచ్చరించారు. ప్రజల ప్రాణాలతో ఆడుకునే ప్రైవేట్ వైద్య వ్యవస్థపై పక్కా నిఘా కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు.స్వస్త్య భద్రత నిబంధనలను పాటించకుండా, ఒక్కేఒక హాస్పిటల్ రిజిస్ట్రేషన్‌తో అనధికారికంగా బ్రాంచుల నిర్వహణ చేయడం తీవ్రంగా పరిగణించబడుతుందన్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి, సంబంధిత బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment