దేశాన్ని ఆర్థికంగా కొత్త పుంతలు తొక్కించిన నేత… మన్మోహన్ సింగ్

*దేశాన్ని ఆర్థికంగా కొత్త పుంతలు తొక్కించిన నేత… మన్మోహన్ సింగ్ *

భారత దేశ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ దివంగతులయ్యారని తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యాను. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. భారత దేశ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలకు ఆద్యులలో ఒకరు శ్రీ మన్మోహన్ సింగ్ . రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా, యూజీసీ ఛైర్మన్ గా విశిష్ట సేవలందించిన ఆయన ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మన్మోహన్ సింగ్ హయాంలో చేపట్టిన సంస్కరణల వల్ల మన ఆర్థిక వ్యవస్థ కొత్త పుంతలు తొక్కింది. ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమైనవి. మన్మోహన్ సింగ్  కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.

(పవన్ కళ్యాణ్)

ఉప ముఖ్యమంత్రి

ఆంధ్ర ప్రదేశ్

Join WhatsApp

Join Now