ప్రయాణికుల రద్దురీత్యా మణుగూరు నుండి కొత్తగూడెం బస్ సర్వీస్ పెంచాలి మణుగూరు రైల్వే స్టేషన్ బస్ సర్వీసును పునరుద్ధరించాలి

IMG 20241011 WA2618

 

మణుగూరు ఆర్టీసీ డిపో మేనేజర్ కె. శ్యాంసుందర్ కి వినతిపత్రం అందజేసిన సామాజిక సేవకులు కర్నె బాబురావు

 

 ప్రయాణికుల రద్దీ రీత్యా మణుగూరు నుండి కొత్తగూడెం బస్సు సర్వీస్ లు పెంచాలని మరియు మణుగూరు రైల్వే స్టేషన్ బస్సు సర్వీసు పునరుద్ధరించాలని కోరుతూ శుక్రవారం నాడు మణుగూరు ఆర్టీసీ డిపో మేనేజర్ కే. శ్యాంసుందర్ కి వినతిపత్రం అందజేసినట్లు సామాజిక సేవకులు కర్నే బాబురావు విలేకరులకు తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ మణుగూరు నుండి కొత్తగూడెం డిపో బస్సు సర్వీసుల సంఖ్య తక్కువగా ఉండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని. ప్రత్యేకించి సాయంత్రం ఆరు గంటల తర్వాత కొత్తగూడెం నుంచి మణుగూరుకు విద్యార్థులు ఉద్యోగులు బస్సు లేక కొత్తగూడెం బస్టాండ్లో తీవ్ర ఇబ్బంది పడుతున్నారన్నారు. ఆరు దాటితే కొత్తగూడెం నుండి మణుగూరు రావడానికి నరకయాతన పడుతున్నారని ఎక్కువ శాతం బస్సులు కిక్కిరిసిన ప్రయాణికులతో ఫుల్ ప్యాక్ అవుతున్నాయని. మరో కొన్ని బస్సులు సాయంత్రం పూట మణుగూరు నుండి కొత్తగూడెం కి కొత్తగూడెం నుండి మణుగూరుకు పెంచే విధంగా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు, అదేవిధంగా ఇటీవల నిలిపివేసిన మణుగూరు రైల్వే స్టేషన్ బస్సు సర్వీసు పునరుద్ధరించాలని ఆయన ఆర్టీసీ యాజమాన్యాన్ని విజ్ఞప్తి చేశారు “బస్సు చక్రం ప్రజా ప్రగతికి చిహ్నం” స్ఫూర్తితో ప్రయాణికుల ఇబ్బందులను గమనించి తగు చర్యలు చేపట్టాల్సిందిగా కోరారు.

Join WhatsApp

Join Now