Site icon PRASHNA AYUDHAM

పాకిస్తాన్ టెర్రరిస్టులను అంతం చేయాలి… పలువురు వ్యక్తలు డిమాండ్. 

IMG 20250424 WA2655

పాకిస్తాన్ టెర్రరిస్టులను అంతం చేయాలి… పలువురు వ్యక్తలు డిమాండ్.

ప్రశ్న ఆయుధం ఏప్రిల్ 24: కూకట్‌పల్లి ప్రతినిధి

పాకిస్తాన్ టెర్రరిస్టులను అంతం చేయాలని ఆకాంక్ష ఫౌండేషన్ వ్యవస్థాపకులు చిటినీడి రామారావు, కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎర్ర యాకన్న లు డిమాండ్ చేశారు. గురువారం కూకట్పల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ ప్రధాన రహదారిపై ఉన్న వివేకానంద విగ్రహం ముందు భారతదేశం లోని జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని అనంతనాగ్ జిల్లా పహల్గాం ప్రాంతంలో బైనారస్ పార్క్ ప్రాంతంలో భారతీయ పర్యాటకులపై పాకిస్తాన్ ఉగ్రవాదులు కాల్పులు జరిపి అత్యంత క్రూరంగా హత్య చేయడంపై దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్న సందర్భంలో కూకట్పల్లి వివేకానంద నగర్ లో ప్రవత్తులు వెలిగించి శాంతియుతంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బద్రీనాథ్, నర్సింహారెడ్డి, జగన్, శ్రీహరి, సంతోష్, గణేష్, మదన్, లింగస్వామి, వి ఆర్ విజయ లింగం, జితేందర్, జగదీష్, నరసింహ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version