Site icon PRASHNA AYUDHAM

అమరుల స్మారక సభలు నవంబరు 1 నుండి 9 వరకు జరపాలి

IMG 20241031 WA0383 1

అమరుల స్మారక సభలు నవంబరు 1 నుండి 9 వరకు జరపాలి

ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి అక్టోబర్

భూమికోసం,భుక్తి కోసం,దేశ విముక్తి కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు విప్లవ జోహార్లు అర్పిస్తూ నవంబర్ 1 నుండి 9-2024 వరకు అమరవీరుల స్మారక సభలను నిర్వహించండి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ పిలుపునిచ్చారు.
భారత విప్లవోద్యమంలో నవంబర్ నెలకి ఎంతో ప్రాధాన్యత ప్రాముఖ్యత ఉన్నది భూమి కోసం భుక్తి కోసం దేశ విముక్తి కోసం అనేకమంది కమ్యూనిస్టు విప్లవకార్లు ఎక్కువమంది నవంబర్ నెలలోనే మరణించారు. అమరవీరుని స్మరిస్తూ నవంబర్ 1 నుండి 9 వరకు అమరవీరుల వర్ధంతి సభలు నిర్వహించాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎస్కే ఉమర్ పిలుపునిచ్చారు.
కొత్తగూడెంలోని ఐఎఫ్టియు కార్యాలయం జరిగిన న్యూడెమోక్రసీ ముఖ్య కార్యకర్తల సమావేశం జిల్లా నాయకులు కల్తీ వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగింది.వారు మాట్లాడుతూ దున్నేవాడికే భూమి నినాదంగా వ్యవసాయ విప్లవ పోరాటాలు సాగించాలని దేశ ప్రజానీకానికి భూమి బుక్తి విముక్తికి నూతన ప్రజాస్వామ్య విప్లవ మాత్రమే మార్గమని ఎలిగెత్తి చాటింది. మార్క్సిజం,మావో,ఆలోచన విధానం ప్రాపంచిక దృక్పథం ఎంచుకున్నది. నక్సల్బరి,శ్రీకాకుళం గోదావరిలోయపోరాటాలు మొదలుకొని నేటిదాకా అనేకమంది భారత విప్లవ అగ్రసేన నాయకులు కార్యకర్తలు అసువులు బాషారు.ప్రతిఘటన పోరాట రూపశిల్పి అమరులు చండ్ర పుల్లారెడ్డి,సత్యనారాయణ సింగ్,దేవులపల్లి వెంకటేశ్వరరావు,భత్తుల వెంకటేశ్వర్రావు,తరిమెల నాగిరెడ్డి,చార్ మజుందార్,కోళ్ల వెంకయ్య,నీలం రామచంద్రయ్య, పోట్ల రామనరసయ్య,జంపాల ప్రసాదు,శ్రీపాద శ్రీహరి,లింగన్న ,ఎల్లన్న,కాచనపల్లి అమరవీరులు,ముస్లిం అమరవీరులు,ఇంకా ఎంతోమంది తమ అమూల్యమైన ప్రాణాలను ఈ విప్లవద్యమంలో అర్పించారు. వీరే కాక అనారోగ్యంతో,రివిజనిస్టుల చేతిలో మాఫియాల చేతిలో ఎంతోమంది బలైనారు.దేశంలో కొనసాగుతున్న అర్థవలస అర్థ భూస్వామ్య దోపిడి వ్యవస్థను కూకటివేల్లతో సహా కూల్చివేయకుండా ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలు పరిష్కారం కావు అనేది గత ఏడదిన్నర దశాబ్దాలు ఆచరణ రుజువు చేసింది.ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు సాగిస్తూనే పాలకులు ముందుకు చేస్తున్న అభివృద్ధి నిరోధక దోపిడీ అణిచివేత విధానాలపై సంఘటిత సమరశీల ఐక్య పోరాటలకు సంసిద్ధం కావాలని ప్రతిఘటన పోరాటాలను మరింత పదును పెట్టుకొని ముందుకు సాగాలని అమరవీరుల ఆశయాల బాటలో కొనసాగాలని వారి పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో జిల్లా డివిజన్ నాయకులు ముసలి సతీష్ పి డి యస్ యు మాజీ జిల్లా కార్యదర్శి వి.సురేష్,వెంకటమ్మ, జక్కుల రాంబాబు,గుగులోతు రామచంద్రు కొండపునేని సత్యనారాయణ,వైయస్ రెడ్డి,వెంకట్రావు,సవాల్ల ఆదినారాయణ,నాగరాజు,ముదిగొండ మల్లయ్య,సమ్మక్క,కమల నాగమణి,కారం వెంకటేశ్వర్లు,రాఘవులు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version