కామారెడ్డిలో భారీగా పోలీసు తనిఖీలు
బస్టాండ్, రైల్వే స్టేషన్ ప్రాంతాలపై కంటకట్టిన ఎస్పీ నరసింహారెడ్డి
60 మంది సిబ్బంది, డాగ్ స్క్వాడ్ సాయంతో సాయంత్రం ఐదు గంటల నుంచి ప్రత్యేక తనిఖీలు
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం నవంబర్ 11
కామారెడ్డి పట్టణంలో భద్రతా పరమైన చర్యలలో భాగంగా ఈరోజు సాయంత్రం ఐదు గంటల నుంచి బస్టాండ్, రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో విస్తృత స్థాయిలో పోలీసు తనిఖీలు చేపట్టనున్నారు. జిల్లా ఎస్పీ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో 60 మంది పోలీసు సిబ్బంది, డాగ్ స్క్వాడ్ బృందాలు పాల్గొంటాయి. అనుమానాస్పద వ్యక్తులు, లగేజీ, వాహనాలపై సోదాలు నిర్వహించారు