మియాపూర్ ముజఫర్ అహ్మద్ నగర్ లో యంసిపిఐ(యు) తెలంగాణ రాష్ట్ర కమిటీ రెండు రోజుల సమావేశం
ప్రశ్న ఆయుధంజూలై 23 :శేరిలింగంపల్లి ప్రతినిధి
యంసిపిఐ(యు) తెలంగాణ రాష్ట్ర కమిటీ రెండు రోజుల సమావేశం మియాపూర్, ముజఫర్ అహ్మద్ నగర్ తాండ్ర రామచంద్రయ్య స్మారక భవన్ లో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ తుడుం అనిల్ కుమార్ అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన యంసిపిఐ (యు) జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ మద్ది కాయల అశోక్ ఓంకార్ మాట్లాడుతూ ఈరోజు న కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని రాష్ట్రాలకు సమానమైన పద్దతుల్లో ఆయా రాష్ట్రాల ఆదాయం ప్రాతిపదికన నిధులు కెటాయించలేదని, బిజెపి పాలిత మరియు బిజెపి కి మద్దతు ఇస్తున్న రాష్ట్రాలకు అదిక నిధులు కెటాయించి, బిజెపి పాలన లేని రాష్ట్రాలకు అరకొర నిధులు కెటాయించటం కేంద్ర బిజెపి పాలనలో పక్షపాత, సాచివేత, రాష్ర్టాల హక్కులను, రాజ్యాంగ స్ఫూర్తిని పూర్తిగా దెబ్బకొట్టడమే అని అన్నారు. బడ్జెట్ లో అన్ని వర్గాలకు సమాన నిష్పత్తిలో కెటాయింపులు జరుగలేదని డెబ్బై శాతం ఉన్న వ్యవసాయ రంగానికి బడ్జెట్ లో 40'/, నిధులు కెటాయించాలసి ఉండగా 1.52 లక్షల కోట్లను కెటాయించటం, విద్యారంగానికి బడ్జెట్లో 30'/, బడ్జెట్ కెటాయించాలసి ఉండగా కేవలం 1.48 లక్షల కోట్లు కెటాయించటం సబబు కాదని *ఈ బడ్జెట్ నోట్లో బెల్లం పెట్టి కంట్లో కారం కొట్టిన చందంగా ఉంది* ఇది పెట్టుబడిదారీ, కార్పోరేట్ వర్గాల ప్రయోజనం కోసం ఈ బడ్జెట్ కెటాయింపులు ఉన్నాయి అని ప్రజలు ఎక్కడికి అక్కడ ప్రజా ఆందోళనలు చేయాలని అని పిలుపునిచ్చారు.
బిజెపి కేంద్రంలో నిన్న విడుదల చేసిన జీవో ప్రభుత్వ ఉద్యోగస్తులు ఆర్ యస్ యస్ లో పని చేయ వచ్చు అని జీవో విడుదల చేయడం అప్రజాస్వామిక చర్య అని రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తి భిన్నం ఐన చర్య అని ఇది అనేక త్యాగాలు చేసి నిర్మించు కొన్న లౌకికవాదం, ఫెడరల్ స్ఫూర్తికి పూర్తి విరుద్ధం అని తక్షణమే జీవో ను రద్దు చేయాలని అన్నారు.
ఒక వైపు మోడీ కి వ్యతిరేకంగా ఆర్ యస్ యస్ పేరుతో మీడీయాలో జోరుగా కార్పోరేట్ మనువాద మీడియా చేస్తున్న ప్రచారం అంతా ఉత్తినే అని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో తేటతెల్లం అయిపోయింది అని అన్నారు. ఇటీవల పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి సీట్లు తగ్గినప్పటికీ తెలుగుదేశం, జనతా దళ్ (యు) అండతో కేంద్రంలో అధికారం లో కొనసాగుతున్న తీరు దానికి బాబు, నితీష్ మద్దతు ఇస్తున్న తీరుపై ప్రజలు ప్రజా తంత్ర శక్తులు సంపూర్ణంగా వ్యతిరేకించాలని అన్నారు.
సమావేశంలో యంసిపిఐ(యు) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ గాదగోని రవి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఈరోజు పార్లమెంటు లో ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం చేసింది అని బడ్జెట్ లో బయ్యారం స్టీల్ ప్లాంట్, కాజిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు కు జాతీయ హోదా కల్పించలేక పోవటం, జాతీయ రహదారులపై నిర్లక్ష్యం వహించటం, ఇంకా రాష్ట్ర విభజన హామీలను విస్మరించి కేంద్ర ప్రభుత్వం సవితి ప్రేమ వ్యక్తం చేయటం జరిగింది అని రాష్ట్ర అభివృద్ధి చేస్తాం అని ఫోజులు పెట్టి పార్లమెంటు కు తెలంగాణ నుంచి గెలిచిన 8 మంది పార్లమెంటు సభ్యులు ఏమి చేస్తున్నారని, ఎందుకు పార్లమెంటు లో ఉండటం వెంటనే రాజినామా చేయాలని ఈ సమావేశం ద్వారా డిమాండ్ చేశారు.
ఈ రాష్ట్ర కమిటీ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్సు వల్లెపు ఉపేందర్ రెడ్డి, వనం సుధాకర్, కుంభం సుకన్య, వరికుప్పల వెంకన్న, ఎన్ రెడ్డి హంసా రెడ్డి,పెద్దారపు రమేష్, యస్ కే నజీర్, వాంకుడోతు తుకారాం నాయక్, గోనె కుమారస్వామి,మంద రవి రాష్ట్ర కమిటీ సభ్యులు మాలోతు జబ్బర్ నాయక్, మైదం శెట్టి రమేష్, నర్రా ప్రతాప్, కంచ వెంకన్న, గుండె బోయిన చంద్రయ్య, కుసుంబ బాపురావు, పల్లె మురళి, కర్ర రాజిరెడ్డి, వంగాల రాగసుధ, తాండ్ర కళావతి, అంగడి పుష్ప, పి. బాగ్యమ్మ, కనుకం సంద్య, గడ్డం నాగార్జున, మాస్ సావిత్రి పాల్గొన్నారు.