*రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు*
మందమర్రి టౌన్ ఫిబ్రవరి 0 4
మందమర్రి పట్టణం యాపల్ ఏరియాలో గల జాతీయ రహదారిపై తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న దృష్ట్యా, మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్, మరియు స్థానిక ఎస్సై జాతీయ రహదారి అధికారులతో కలిసి సమీక్ష జరిపి, రోడ్డు ప్రమాదాలు జరగడానికి గల కారణాలు గుర్తించి, రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలో భాగంగా జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న రైలింగ్స్ పూర్తిగా మూసివేయడం జరిగింది. గతం సంవత్సరంలో ఈ రైలింగ్స్ సందుల గుండా ప్రజలు రోడ్డు దాటడం వలన,ఇతర కారణాల వలన ప్రమాదాలు జరిగి నలుగురు మరణించినారు, అదేవిధంగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.