Site icon PRASHNA AYUDHAM

కురుపాం ఎమ్మెల్యే ని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా మహిళా సమాఖ్య సభ్యులు…

IMG 20250617 WA1878

*కురుపాం ఎమ్మెల్యే ని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా మహిళా సమాఖ్య సభ్యులు…*

పార్వతీపురం మన్యం జిల్లా ప్రతినిధి జూన్ 17 ( ప్రశ్న ఆయుధం న్యూస్ ) దత్తి మహేశ్వరరావు

గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వ విప్ మరియు కురుపాం శాసనసభ్యురాలు *తోయక* *జగదీశ్వరి* మంగళవారం నాడు మన్యం జిల్లా మహిళా సమాఖ్య సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. మహిళా సంఘాల అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని ఎమ్మెల్యే కోరారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే మహిళల అభివృద్ధికి ఎల్లప్పుడూ తన వంతు సహాయం ఉంటుందని ఈ సందర్భంగా అన్నారు. ఎమ్మెల్యే ని కలిసిన వారిలో జిల్లా మహిళా సమాఖ్య ప్రెసిడెంట్ కె.లలితకుమారి, సెక్రెటరీ సుబ్బలక్ష్మి, ట్రెజరర్ పి.రాజేశ్వరి, తదితరులు ఉన్నారు.

Exit mobile version