ప్రజావాణిలో అక్రమ సెల్లార్ ల పై జిహెచ్ఎంసి కమీషనర్ కి ఫిర్యాదు చేసిన మిద్దెల మల్లారెడ్డి

*ప్రజావాణిలో అక్రమ సెల్లార్ ల పై జిహెచ్ఎంసి కమీషనర్ కి ఫిర్యాదు చేసిన మిద్దెల మల్లారెడ్డి*

*ప్రశ్న ఆయుధం,జూన్23,శేరిలింగంపల్లి,ప్రతినిధి*

అయ్యప్ప సొసైటీలో అసలే అక్రమ కట్టడాలు ఆపైన అనుమతులు లేని భారీ సెల్లార్ గుంతలు తవ్వకాలు వర్షాకాలంలో ఎలాంటి గుంతలు తవ్వకూడదు అని నిబంధనలు ఉన్నప్పటికీ అయ్యప్ప సొసైటీ ప్లాట్ నెంబర్ 39 కి ఎదురుగా భారీ సెల్లార్ గుంత తవ్వుతున్నారు అలాగే ప్లాట్ నెంబర్ 133 లో కూడా సెల్లార్ తవ్వుతున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను జిహెచ్ఎంసి అధికారులను ప్రశ్నిస్తున్నాను గౌరవ జిహెచ్ఎంసి ఉప కమిషనర్ మోహన్ రెడ్డి కి నేను వాట్సాప్ ద్వారా ఇట్టి అక్రమ సెల్లార్ గుంతల గురించి తెలియపరుస్తుంటే అతను నా వాట్సాప్ ను బ్లాక్ చేశాడు ఇది ఎంతవరకు సబబు ఇది తమరి సొంత ఫోను కాదు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫోన్ నెంబర్ ఇది ప్రజల సమస్యలను తమరికి వెంట వెంటనే తెలియపరస్తుంటే నా ఫోన్ నంబరు బ్లాక్ చేశారు ఓకే కానీ తమరికి మేము ప్రజల సమస్యలను ఎలా తెలుపాలో తమరే మాకు సెలవియ్యాలి ఏది ఏమైనాప్పటికీ తమరి అధికారులను పంపించి పరిశీలించి వర్షాకాలం వెళ్లే వరకు ఇట్టి అక్రమ సిలార్ గుంతలను వెంటనే నిలిపివేయాలని బి ఆర్ ఎస్ పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గం ఉపాధ్యక్షులుగా నేను డిమాండ్ చేస్తున్నాను

Join WhatsApp

Join Now

Leave a Comment