పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి దామోదర్ రాజనర్సింహా

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 31 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం మేలసంగంలోని కాటన్ మిల్ లో కాటన్ కార్పొరేషన్ అఫ్ ఇండియా (సీసీఐ) ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా జిల్లా కలెక్టర్ ప్రావీణ్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి దామోదర్ రాజనర్సింహా మాట్లాడుతూ .. పత్తి రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించామని అన్నారు. రైతులకు కనీస మద్దతు ధర (ఎంఎస్ పీ)ను కల్పించాలని సీసీఐ అధికారులను మంత్రి కోరారు. దళారులను నమ్మవద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు. ఈ కొనుగోలు కేంద్రం ద్వారా సదాశివ పేట , రాయికోడ్, నారాయణ ఖేడ్, జోగిపేట, వాట్పల్లి మండలాల పత్తి రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. పత్తి రైతులు కనీస మద్దతు ధర (ఎంఎస్ పీ) కోసం ‘కపాస్ కిసాన్ ‘మొబైల్ యాప్ ను డౌన్ లోన్ చేసుకోవాలని సీసీఐ అధికారులు కోరారు. గత వర్షాకాలం (2024-25) లో 3 లక్షల 80 వేల క్వి0టాల్ల పత్తిని కోనుగోలు చేసి రైతులకు 280 కోట్ల రూపాయలను చెల్లించామని సీసీఐ అధికారులు మంత్రి దామోదర్ రాజనర్సింహాకు వివరించారు. పత్తి రైతుల ప్రయోజనాలను కాపాడాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ సందర్బంగా రైతులకు జొన్న విత్తనాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీసీఐ సీనియర్ కమర్షియల్ ఆఫీసర్ వరుణ్, జిల్లా వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment