Site icon PRASHNA AYUDHAM

ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దాక తులం బంగారం ఇస్తాం మంత్రి పొంగులేటి..

IMG 20241110 WA0017

ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దాక తులం బంగారం ఇస్తాం మంత్రి పొంగులేటి..


ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దాక తులం బంగారం ఇస్తాం మంత్రి పొంగులేటి
రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు తులం బంగారం తప్పకుండా ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచిలో శనివారం కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. మంత్రి మాట్లాడుతూ. గత ప్రభుత్వ పెద్దలు రూ.7.19 లక్షల కోట్ల అప్పులు చేశారని ఆరోపించారు. వాటిని తీర్చుకుంటూ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. ఇచ్చిన హామీపై వెనక్కి తగ్గేదే లేదన్నారు.

Exit mobile version