మంత్రి సురేఖ ఇంటి ముట్టడి – మధ్యాహ్న భోజన కార్మికుల ఆగ్రహం
మధ్యాహ్న భోజన బిల్లులు పెండింగ్ – వెంటనే చెల్లించాలని డిమాండ్
డబ్బుల్లేక ఇబ్బంది పడుతున్నామని కార్మికుల ఫిర్యాదు
బాధ్యతలు అక్షయపాత్రకు అప్పగించొద్దని ఆవశ్యకత
మంత్రికి నివాసం వద్ద ముట్టడి, నినాదాలు
నిరసన కార్మికులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
హనుమకొండ, ఆగస్టు 11:
మధ్యాహ్న భోజన పథకం కింద వండే బిల్లులు చాలాకాలంగా పెండింగ్లో ఉన్నాయని, డబ్బుల్లేక కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నామని ఆగ్రహంతో కార్మికులు మంత్రి కొండా సురేఖ నివాసం వద్దకు చేరుకున్నారు. పెండింగ్ బకాయిలు తక్షణం చెల్లించాలని, మధ్యాహ్న భోజన బాధ్యతలు అక్షయపాత్ర సంస్థకు అప్పగించొద్దని జోరుగా నినాదాలు చేశారు.
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకుని నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు.