మాట ఇచ్చాము నిలబెట్టుకున్నాం : మంత్రి వివేక్ వెంకట స్వామి 

మాట ఇచ్చాము నిలబెట్టుకున్నాం : మంత్రి వివేక్ వెంకట స్వామి

రాష్ట్ర అభివృద్ది కాంగ్రెస్ తోనే పేదల అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయం గజ్వేల్ నియోజక వర్గానికి 2935ఇందిరమ్మ ఇండ్ల మంజూరు.మాట ఇచ్చాము నిలబెట్టుకున్నామని రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమని పేదల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరా గాంధీ కలలను నిజం చేస్తారు అన్నారు.గజ్వేల్ పట్టణంలోని బింగి ఎల్లయ్య గార్డెన్స్ లో రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి చేతుల మీదుగ గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని ఇందిరమ్మ గృహాలు 2938 ప్రొసీడింగ్స్ అందించారు .ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ఆనాడు ఇందిరమ్మ పేద ప్రజల కోసం ఇందిరమ్మ ఇండ్లను అందించి పేద ప్రజల గుండెల్లో నిలిచారని.పేద ప్రజల అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి కంకణం కట్టుకుని పనిచేస్తున్న సంగతి గుర్తు చేశారు.కోవిడ్ సమయంలో వైద్యం కోసం ప్రజలు ఇబ్బంది పడ్డారనీ 10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా పేద ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తుందనీ. అంతకంటే ఎక్కువ ఖర్చు అయితే సీఎం రిలీఫ్ ఫండ్ రిలీప్ పండు ద్వారా ఇస్తున్నామన్నారు.900 కోట్ల cm రిలీఫ్ ఫండ్ ఇచ్చాము.గజ్వేల్ నియోజకవర్గంలో 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ద్వారా రైతులకు లబ్ధి చేకూరుతుందనీ.మానిఫెస్టోలో లేకు న్న 13 వేల కోట్ల తో సన్నబాయ్యం పంపిణీ ద్వారా పేదల ఆకలి తీరుస్తున్నట్లు తెలిపారు

వర్షాకాలంలో పేద ప్రజలు ఇబ్బంది పడరాదని చౌక ధరల దుకాణాల ద్వారా ఒకే సారి 3 నెలల సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రైతు భరోసా సాయం వారం పది రోజుల్లో రైతులందరికీ ఖాతాలోకి వేస్తామన్నారు.సొంత ఇల్లు ఉండాలనే పేద ప్రజల కోరిక మేరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా బీద ప్రజలకు సాయం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తుందనీ 5 లక్షలతో 600 ఫీట్ల వరకు మాత్రమే ఇళ్ళు నిర్మించుకోవాలి దానికే ఇందిరమ్మ ఇల్లు వర్తిస్తుందన్నారు.దరఖాస్తు చేసుకున్న అర్హులు అందరికీ రాబోయే మూడు, నాలుగు సంవత్సరాలలో ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తుందనీ భరోసా ఇచ్చారు.విద్య, వైద్య, ఇండ్లు, ఇరిగేషన్, మౌలిక వసతులు కల్పన తదితర అన్ని రంగాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందనీ.ఆర్థికంగా ప్రభుత్వానికి ఎంత ఇబ్బంది ఉన్న మెదక్ ఉమ్మడి జిల్లా ఇంచార్జి మంత్రిగా జిల్లా అభివృద్ధి చేస్తామన్నాడు దాదాపు 3000 ఇండ్లు గజ్వె్ల్ లో సాంక్షన్ ఇస్తున్నట్లు లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు.200 ఉచిత విద్యుత్ యూనిట్ల స్కీమ్ కింద రాని వారు అప్లయ్ చేసు చేసుకోవాలని 500 గ్యాస్ స్కీమ్ రాని అర్హత ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవాల ప్రతి పథకం పేదోని వరకు వచ్చేలాగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు.

ఉమ్మడి మెదక్ జిల్లాలో సమస్యలుంటే సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఏ సమస్య ఉన్న తన దృష్టికి తీసుకురావాలని ప్రజలను నాయకులను కోరారు. అధికారులు ప్రజలకు ప్రభుత్వ పథకాలు తీసుకువెళ్లి న్యాయం చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి, జిల్లా కలెక్టర్ హైమావతి జిల్లా అదనపు కలెక్టర్ లు గరీమా అగ్రవాల్, అబ్దుల్ హమీద్, గాజ్వెల్ ఆర్డీఓ చంద్రకళ, హోసింగ్ పీడీ దామోదర్ రావు, గజ్వేల్ ఎమ్మార్వో శ్రావణ్ కుమార్ మున్సిపల్ కమిషనర్ గోల్కొండ నరసయ్య గాజ్వెల్ ఏఎంసి చైర్మన్ నరేందర్ రెడ్డి, వంటిమామిడి ఏఎంసి చైర్మన్ విజయ మోహన్, కుకునూరుపల్లి ఏఎంసి చైర్మన్ శ్రీనివాస్, ప్రజా ప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment