*పల్లా సింహాచలంకు నివాళులర్పించిన*
*పార్వతీపురం నియోజవర్గం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర*
పార్వతీపురం మన్యం జిల్లా ప్రతినిధి జూన్ 23 ( ప్రశ్న ఆయుధం న్యూస్) దత్తి మహేశ్వర రావు
పార్వతిపురం : తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తండ్రి స్వర్గీయ సింహాచలంకు ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర ఘన నివాళులర్పించారు. ఇటీవల స్వర్గస్తులైన సింహాచలం దశదిన కర్మ కార్యక్రమం గాజువాక పల్లా నివాసంలో ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి ఎమ్మెల్యేలు,ఎంపీలు,ముఖ్య నాయకులు అందరూ పాల్గొని సింహాచలం కు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయ్ చంద్ర మాట్లాడుతూ నేటితరం రాజకీయ నాయకులకు పల్లా సింహాచలం స్ఫూర్తిదాయకమని, విశాఖ జిల్లాలో సుదీర్ఘ రాజకీయ నడిపిన ఆయనను ఈ ప్రాంత ప్రజలు ఎంతో గౌరవించే వారిని తెలిపారు. తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తున్న టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పళ్ళ శ్రీనివాసరావు రాష్ట్రంలోని అత్యధిక మెజారిటీ సాధించి తిరుగులేని నాయకుడిగా కొనసాగుతున్నారని పేర్కొన్నారు ఎవరికి ఏ కష్టం వచ్చినా తాను ఉన్నానంటూ భరోసా కల్పించే పల్లా శ్రీనివాసరావును గాజువాక ప్రజలు గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నారని ఆయన సేవా తత్పరతకు ఇది నిదర్శనం అని కొనియాడారు.