ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలి: ఎమ్మెల్యే చింతా ప్రభాకర్

సంగారెడ్డి ప్రతినిధి, అక్టోబరు 17 (ప్రశ్న ఆయుధం న్యూస్): ఇందిరమ్మ కమిటీల ఏర్పాటులో మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించాలని, అన్ని వర్గాల ప్రజలతో చర్చించి ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. గురువారం జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ కు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ వినతి పత్రం అందజేశారు. ఇందిరమ్మ కమిటీ ఏర్పాటులో మార్గదర్శకాలు పాటించడం లేదని తమ దృష్టికి వచ్చాయని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ కు వివరించారు. మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలని సంబంధిత అధికారులకు సూచించాలని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ను కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ కొండల్ రెడ్డి, విజేందర్ రెడ్డి, ఆర్. వెంకటేశ్వర్లు, జీ.వీ.శ్రీనివాస్, గుండు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now