ముఖ్యఅతిధిగా పాల్గొన్న ఎమ్మెల్యే జారె ఆదినారాయణ
జిల్లా విద్యాశాఖధికారి చలపతి రాజు
దమ్మపేట మండలం గండుగులపల్లి జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం నిర్వహించి. ప్రభుత్వ పాఠశాలలలో ప్రతి విద్యార్థి చదువుకునేలా ప్రోత్సహిస్తూ రాష్ట్రప్రభుత్వం విద్యాభివృద్ధి కోసం కల్పిస్తున్న వసతులను విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించారు. కార్యక్రమంలో భాగంగా బ్రైట్ చైల్డ్ ఫౌండేషన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో పాఠశాలకు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఆట వస్తువులు కంప్యూటర్లు అందించారు. విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం కోసం ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వనున్నామని సంస్థ సభ్యులు సూర్య నాగరాజు తెలిపారు పేద మధ్యతరగతి విద్యార్థులకు చేయూతనందించాలని కృషి చేస్తున్న బ్రైట్ చైల్డ్ ఫౌండేషన్ సభ్యులను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ తన పదవీకాలంలో ప్రతి వ్యవస్థలో మార్పులు తీసుకొస్తానని విద్యా వైద్యం వ్యవసాయంతో పాటు అన్ని రంగాలలో అశ్వారావుపేట నియోజకవర్గాన్ని అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తానని తెలిపారు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులతో దీటుగా అన్ని అంశాలలో ప్రతిగావంతులుగా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు సూచించారు విద్యార్థులలో ముఖ్యంగా సెల్ ఫోన్ వినియోగం హెయిర్ కటింగ్ డ్రస్సింగ్ తదితర విషయాలలో వచ్చే మార్పులను గమనించి జాగ్రత్త వహించాలని తల్లిదండ్రులకు సూచించారు. యువత ఇటీవల చెడు మార్గాల వైపు వెళుతున్న తరుణంలో వారిపై ప్రత్యేక నిఘా ఉంచి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ఎస్సై సాయి కిషోర్ రెడ్డి కి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ కీసరి లక్ష్మీ గారు పలు పాఠశాలల ఉపాధ్యాయులు కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామస్తులు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం లో ఎమ్మెల్యే
by Naddi Sai
Published On: June 19, 2025 7:40 pm
