Headlines :
వాలీబాల్ టోర్నమెంట్ లో విజేతలకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ
యువత డ్రగ్ మహమ్మారి బారిన పడొద్దు ఎమ్మెల్యే
ప్రశ్నఆయుధం న్యూస్ అశ్వరావుపేట ఆర్సి సెప్టెంబర్ 1
దమ్మపేట మండలం లింగాలపల్లి గ్రామంలో గ్రామ పెద్దల సహకారంతో గ్రామపంచాయతీ స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించగా, ప్రధమస్థానంలో నిలిచిన జట్టుకి స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మొదటి బహుమతి అందించారు. రెండు మూడు నాల్గవ బహుమతులను మాజీ సర్పంచ్ చాప రాఘవయ్య , పండా భాను , లాలు చాప ఆనంద్ సహకారంతో అందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడాకారులను వెన్నుతట్టి ప్రోత్సహిస్తానని క్రీడల వల్ల శారీరక మానసిక ఆనందమే కాకుండా మెరుగ్గా రానిస్తే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఆడే గొప్ప అవకాశం వస్తుందని ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో వివిధ క్రీడాలలో పాల్గొంటున్నవారు గ్రామీణ ప్రాంతాలు మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారే అధిక శాతం ఉన్నారని ఆటలలో ధనిక పేద అనే తేడా ఉండదని పట్టుదల శ్రమ ఉంటే ఎవరైనా ఉన్నత స్థానానికి వెళ్లొచ్చన్నారు ఉత్తమ ప్రతిభ కనబరిచే క్రీడాకారులకు తన ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుందని తెలిపారు.
అలాగే యువత గంజాయి, డ్రగ్స్, మందు, పేకాట లాంటి చెడు వ్యసనలా వైపు వెళ్లొద్దన్నారు. చిన్నతనంలోనే ఏదో ఒక తప్పిదం వల్ల ప్రాణాలు కోల్పోయి కుటుంబాలను ఒంటరిగా మిగులుస్తున్నారని రోడ్డు ప్రమాదాల బారిన పడి మైనర్లు కూడా ప్రాణాలు కోల్పోతున్నారని తల్లిదండ్రులు పిల్లలుకు బండ్లు కొనిచ్చే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించవలసిన అవసరం ఉందన్నారు. పిల్లలను మంచిగా చదువుకునేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరారు.