Site icon PRASHNA AYUDHAM

నకిలీ విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉండాలి ఎమ్మెల్యే జారె ఆదినారాయణ

IMG 20250530 WA0198

ప్రశ్న ఆయుధం న్యూస్ అశ్వరావుపేట ఆర్ సి (మే 30)
అశ్వారావుపేట ప్రాథమిక సహకార పరిమితి సంఘం ఆధ్వర్యంలో మండల రైతులకు 50 శాతం సబ్సిడీతో జనుము జీలుగు విత్తనాలు పంపిణీ కార్యక్రమాన్ని వారి చేతుల మీదుగా ప్రారంభించారు.ఎమ్మెల్యే జారే ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు భూసారం పెంచి వారి పెట్టుబడి ఖర్చులు తగ్గి లాభదాయకమైన వ్యవసాయానికి చేయూతనివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం 50% సబ్సిడీతో పచ్చిరొట్ట విత్తనాలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్ని రంగాల్లో తోడ్పాటును అందిస్తోందని నాయకులు అధికారులు కూడా రైతుల అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు త్వరలోనే విశాల సహకార పరిమితి సంఘం ఆధ్వర్యంలో నాణ్యమైన వరి విత్తనాలు పంపిణీ చేస్తుందన్నారు. అవసరమున్న అర్హులైన రైతులు సమీప సహకార సంఘాన్ని సంప్రదించాలని కోరారు నకిలీ విత్తనాలతో మోసపోకుండా జాగ్రత్త వహించాలన్నారు అధికారులు కూడా నకిలీ విత్తనాల కట్టడికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.

Exit mobile version