ప్రశ్న ఆయుధం న్యూస్ అశ్వరావుపేట (ఆర్సి)
దమ్మపేట జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో నేను సైతం చేయూత ద్వారా స్థానిక ఎస్ఐ సాయి కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం
అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ దమ్మపేట మండలంలో పలు గ్రామాల్లో పూర్తి అయిన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి ప్రజలకు అంకితం చేశారు మొత్తం రూ. 3 కోట్లు 44 లక్షల 50 వేల రూపాయల వ్యయంతో నిర్మితమైన సీసీ రోడ్లు పాఠశాలల ప్రహరీ గోడలు త్రాగునీటి కోసం నూతన బోరు మోటార్లు పైప్ లైన్లు హ్యాండ్ పంపులు తదితర పనుల ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు.పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా లబ్ధిదారులకు మంజూరైన చెక్కులు అందించి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు ప్రాథమిక సౌకర్యాలు ప్రజల ఇంటి ముంగిటికి చేర్చడానికి విశేషంగా కృషి చేస్తున్నట్టు పేర్కొన్నారు. రోబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజలకు మంచి చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతుగా నిలవాలన్నారు ప్రభుత్వం అందించే పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నాయకులకు కార్యకర్తలకు సూచించారు. అదేవిధంగా నాచారం గ్రామంలో లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సందర్శించి నిర్వాహకులను అభినందించారు. దమ్మపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్థానిక ఎస్సై స్థాయికిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యాభివృద్ధికి నేనుసైతం చేయూత కార్యక్రమం ద్వారా విద్యార్థులకు మంచినీటి సౌకర్యార్థం కూలింగ్ వాటర్ క్యాన్లు ఉచితంగా అందించారు ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ మండల, నాయకులు కార్యకర్తలు అభిమానులు మండలఅధికారులు తదితరులు పాల్గొన్నారు.
దమ్మపేట మండలంలో 3.44 కోట్ల పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జారె
by Naddi Sai
Published On: June 24, 2025 9:13 pm
