Site icon PRASHNA AYUDHAM

బాలల హక్కుల పై అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే జారె

IMG 20250612 WA0222

ప్రశ్న ఆయుధం న్యూస్ అశ్వరావుపేట (ఆర్సి జూన్ 12)

పిల్లల హక్కులు మిషన్ వస్త్యల్యపై అవగాహన కల్పించేందుకు అంగన్వాడి ఉద్యోగుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.అనంతరం అవగాహన కార్యక్రమం అశ్వారావుపేట ఐసిడిఎస్ కార్యాలయంలో నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పాల్గొని ఉపాధ్యాయులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్ సోషల్ వర్కర్ బాబు ముఖ్య వక్తగా పాల్గొని పిల్లల హక్కుల గురించి మిషన్ వస్త్యల్య పథకం ఎవరికి వర్తిస్తుందనే, అంశాలను వివరించి. అవసరమైన డాక్యుమెంట్ల వివరాలను ఉపాధ్యాయులకు తెలియజేశారు .ఈ కార్యక్రమంలో *అమ్మ మాట* అంగన్వాడి టీచర్లతో కలిసి బాలల హక్కులపై బాట ర్యాలీ నిర్వహించబడింది. సిడిపిఓ ముత్తమ్మ మాట్లాడుతూ రెండున్నర సంవత్సరాల వయస్సు వచ్చిన పిల్లలను తప్పనిసరిగా అంగన్వాడి కేంద్రంలో చేర్చి ప్రీ-స్కూల్ సిలబస్ ప్రకారం విద్యా కార్యక్రమాలు నిర్వహించాలి అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు విజయలక్ష్మి సౌజన్య, పద్మావతీ, రమాదేవి వరలక్ష్మీ ,పోషణ అభియాన్ బీసీ,శ్రీకాంత్ అంగన్వాడి టీచర్లు పాల్గొన్నారు.
పిల్లల అభివృద్ధి, ఆరోగ్యం, విద్య విషయంలో అంగన్వాడి కేంద్రాల పాత్ర ఎంతో ప్రాముఖ్యమైనదని అధికారులు ఈ సందర్భంగా తెలిపారు.

Exit mobile version