క్రీడాల పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే జారె ఐటీడీఏ పీ ఓ

ప్రశ్న ఆయుధం న్యూస్ అశ్వరావుపేట ఆర్సీ డిసెంబర్ 6

దమ్మపేట మండలం అంకంపాలెం ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినిలు ఆటల కోసం ప్రత్యేకంగా స్థలం లేనందువలన ఎమ్మెల్యే
జారె ఆదినారాయణ విషయం తెలుసుకొని ఆట స్థలం ఏర్పాటుకై ప్రత్యేక దృష్టి సారించి .అదే గ్రామానికి చెందిన వగ్గెల జనార్ధన్ రావు ని సంప్రదించగా వారికి పాఠశాల పక్కన ఉన్నటువంటి స్థలంలో కొంత భాగం విరాళం ఇచ్చారు. ఆ స్థలాన్ని విద్యార్థినిల కోసం వినియోగంలో తీసుకొచ్చి ఈరోజు భద్రాచలం ఐటిడిఏ పిఓ బి రాహుల్ ఐఏఎస్ స్థలదాత వగ్గెల జనార్దన్ తో కలసి క్రీడా స్థలాన్ని ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం సమావేశం నిర్వహించి విద్యార్థులను ఉద్దేశించి ప్రముఖులు ప్రసంగించి స్థలదాత జనార్దన్ రావు ని ప్రత్యేకంగా అభినందించి. ప్రభుత్వం తరఫున పాఠశాల యాజమాన్యం తరపున కృతజ్ఞతలు తెలిపారు.
అలాగే ఐటీడీఏ పీవో పాఠశాల విద్యార్థినులతో కలసి ఎమ్మెల్యే మధ్యాహ్న భోజనం చేశారు.
అనంతరం విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించిబహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో మండలకాంగ్రెస్ పార్టీ నాయకులు, దమ్మపేట మార్కెట్ కమిటీ చైర్మన్ వాసం రాణి శ్రీనివాస్, స్థానిక కాంగ్రెస్ నాయకులు గ్రామస్తులు అధికారులు మాజీ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now