నియోజవర్గంలో పలు కార్యక్రమాలు ప్రారంభించిన ఎమ్మెల్యే జారే

ప్రశ్న ఆయుధం న్యూస్ అశ్వరావుపేట ఆర్సి
అశ్వారావుపేట మండలంలోని పలు గ్రామాలలో పర్యటించి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకొని వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.పర్యటనలో భాగంగా సీసీ రోడ్లు డ్రైనేజీలు పాఠశాలలకు ప్రహరీ గోడలు అంతర్గత రహదారుల విస్తరణ గ్రామీణ విద్యుత్ సరఫరా మెరుగుదల కోసం విద్యుత్ స్తంభాలు విద్యుత్ లైన్ల ఏర్పాటు త్రాగునీటి సరఫరా కోసం బోర్లు మోటార్లు హ్యాండ్‌పంపుల ఏర్పాటు వంటి అనేక అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, వ్యవసాయం రంగంతో పాటు గృహజ్యోతి ద్వారా ఇంటి అవసరాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రెండులక్షల రైతు రుణమాఫీ, రైతు భరోసా ద్వారా ఎకరానికి 12 వేలు పెట్టుబడి సహాయం, 5 లక్షలతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, విద్యార్థులకు హాస్టళ్లలో మెరుగైన వసతులు మెనూ చార్జీలపెంపు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, పేదలకు రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ, మహిళలు ఆర్ధికంగా అభివృద్ధి చెందటం కోసం ఇందిరా మహిళా శక్తి వంటి ప్రత్యేక పథకాలు, సామాన్యులకు వైద్యం కోసం ఆరోగ్యశ్రీ పథకాన్ని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంపు, సన్నరకం వరి ధాన్యానికి బస్తాకు 500 బోనస్ అందించడం, గృహలక్ష్మీ ద్వారా గ్యాస్ సబ్సిడీ వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు అలాగే ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా సహాయం అందించడం అత్యవసర సర్జరీ కోసం ఎల్ ఓ సి రూపంలో ఉచిత ట్రీట్మెంట్ అందించడంలో రాష్ట్ర వ్యాప్తంగా ముందు వరసలో ఉన్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ పంచాయత్ రాజ్ డీఈ శ్రీధర్ ఏఈ అక్షిత ఫీల్డ్ ఆఫీసర్ శ్రీనివాసరావు ఆర్డబ్ల్యూఎస్ డీఈ సలీం ఏఈ సతీష్ మండల మాజీ అధ్యక్షులు తుమ్మా రాంబాబు మండల నాయకులు జూపల్లి రమేష్ జూపల్లి ప్రమోద్ ఫణి గారు మిండ హరి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment