Site icon PRASHNA AYUDHAM

శ్రీ వైద్యనాథ్ ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి

IMG 20251021 185312

శ్రీ వైద్యనాథ్ ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి

అమావాస్య, కార్తీక పౌర్ణమి ప్రారంభం సందర్భంగా భక్తి మయ వాతావరణం

శ్రీ వైద్యనాథ్ ఆలయంలో భక్తులతో కిటకిటలాడిన ప్రాంగణం

ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు

ఎమ్మెల్యే వెంకట రమణ రెడ్డి స్వయంగా పాల్గొని పూజలు నిర్వహణ

ప్రాంత ప్రజలకు శుభకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

ప్రశ్న ఆయుధం కామారెడ్డి, అక్టోబర్ 21:

కామారెడ్డి పట్టణంలోని శ్రీ వైద్యనాథ్ ఆలయంలో నేడు అమావాస్య, కార్తీక పౌర్ణమి ప్రారంభం సందర్భంగా భక్తి పరవశంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి పాల్గొని స్వయంగా శ్రీ వైద్యనాథ్ స్వామివారికి అభిషేకం, అర్చన చేశారు.

ఆలయ ప్రాంగణం భక్తుల సందడితో నిండిపోగా, వేడుకల మధ్య మంత్రోచ్చారణలు మార్మోగాయి. ఎమ్మెల్యే రమణ రెడ్డి ప్రాంత ప్రజలకు కార్తీకమాస శుభాకాంక్షలు తెలుపుతూ — “ఈ పవిత్ర మాసం ప్రతి ఇంటా శాంతి, సౌభాగ్యం, ఆరోగ్యం కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను” అని అన్నారు.

కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Exit mobile version