డాక్టర్ మద్దెల శివకుమార్ ఘనంగా సన్మానించారు*
ప్రశ్న ఆయుధం న్యూస్ జూన్ 12 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి
అభ్యుదయ కళా సేవా సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ అన్నారు.
అసెంబ్లీ ఎన్నికల కురుక్షేత్ర యుద్ధంలో,అత్యధిక ప్రజల అన్ని వర్గాల ప్రజలఅభీష్టంతో ,
ఆకాంక్షతో ఆమోదంతో,25 వేల అత్యధిక మెజారిటీతో, ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచినటువంటి కొత్తగూడెం శాసనసభ్యులు గౌరవనీయులు కూనంనేని సాంబశివరావు ఎన్నికల అఫిడవేట్లో తప్పులు వ్రాసి ఎన్నికల కమిషన్ ను మభ్యపెట్టారని కొంతమంది స్వార్థపరులు దుర్మార్గులు
ఎమ్మెల్యే కూనంనేని గెలుపును జీర్ణించుకోలేనికొందరు కుట్ర కుతంత్రాలతో హైకోర్టులో కేసు వేసి,తామే గెలుస్తామని దుష్ప్రచారం చేస్తూ సంకలు గుద్దుకున్నారని,అయితే సత్యం ధర్మం న్యాయంతో ఎన్నికల్లో గెలిచినకూనంనేని హైకోర్టులో కూడా గెలవడం,దుర్మార్గం ఎప్పటికైనా ఓడిపోతుందని, సత్యమేవ జయతే అంటూ సత్యం ధర్మం న్యాయం ఎప్పటికీ గెలుస్తుందని నిరూపించారని, ఇది కుట్ర దారులకు చెంప పెట్ట హైకోర్టు రుజువు
చేసిందనిఅన్నారు.
అనుకూలంగా వచ్చినందువలన, ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని,ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ తన బృందంతోనాడు స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో
హైకోర్టు లో తీర్పు విజేత ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుని గజమాల తో, శాలువాతో ఘనంగా సత్కరించి అభినందించారు. అంతేకాకుండా ఎమ్మెల్యే కూనంనేనికి అహర్నిశలు అండగా నిలుస్తూ, కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధిలో నేను సైతం అంటూ క్రియాశీలక సన్నిహితుడైన ఎస్ కే సాబీర్ పాషా ని కూడా పూలమాలలు శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ శుభ సందర్భంగా స్వీట్లు తినిపించారు.
ఈ సందర్భంగా ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ మాట్లాడుతూ అంకితభావం కృషి దీక్ష దక్షతలు కటోర పరిశ్రమ మానవ సంబంధాలు త్యాగనిరతి నిరంతర సేవా దృక్పథంతో గత 50 సంవత్సరాలుగా కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా
సిపిఐ లో ఎంతో కష్టపడి అంచలంచలుగా ఎదిగి,
ఎన్నో పోరాటాలు ప్రజా ఉద్యమాలు చేసి, లాఠీ దెబ్బలు తిని జైల్లల్లో మగ్గి, తన జీవితాన్ని పేద ప్రజల కొరకే అంకితం చేశాడని, ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కూడా క్రియాశీలక పాత్ర వహించి ఎన్నోసార్లు జైల్లోకి వెళ్లి వచ్చారనిమండల పరిషత్ అధ్యక్షులుగా, గతంలో ఒకసారి శాసనసభ్యులుగా, నేడు సిపిఐ పార్టీలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అత్యున్నత స్థానాన్ని పొంది, గత 50 సంవత్సరాలుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సిపిఐ పార్టీని సిపిఐ కేడర్ ను
బ్రతికించుకుంటూ,
పీడిత తాడిత కార్మిక కర్షక బడుగు బలహీన వర్గాల పేద వర్గాల పక్షపాతిగా కుల మతాలకు అతీతంగా
సామాజిక మార్పు కోసం సమసమాజ స్థాపన కోసం నిరంతరం కృషి చేస్తున్న, మనందరి అభిమాన పాత్రులు అన్నగారు పదవిని ఆశించో మరి ఏ పదవిని ఆశించో పనిచేయడంలేదని నిరంతర కృషికి సేవా తత్పరతకు, దీక్ష దక్షతలకు కటోర పరిశ్రమకు కట్టిన పట్టమని,పదవులే వారిని వరించాయని, ఆచార్య డాక్టర్ మద్దెల ప్రశంసించారు.
ముఖంలో చెరగని చిరునవ్వు, 50 సంవత్సరాలుగా ఎవరిని మర్చిపోని ఏ విషయాన్ని మర్చిపోని అద్భుతమైన జ్ఞాపకశక్తి, ఎన్నటికీ విడిచిపెట్టని విస్తృతమైన ప్రజా సంబంధాలు, ఆరోగ్యం సహకరించక పోయినా ప్రజా సమస్యల పట్ల నిరంతర కృషి,అసెంబ్లీలో గళమెత్తి నినదించి పెద్దన్నపాత్ర,ప్రతి విషయాన్ని గూర్చి కూలంకషంగా తెలుసు కునే జిజ్ఞాస,అభిలాష, అధ్యయనం,నిత్య విద్యార్థి లాగా అన్వేషణ,అన్ని అంశాలపై అపరిమిత మేధస్సు సమస్యలపై పరిస్థితులపై నిరంతర పరిశోధన, కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధిపై సునిశితమైన నిరంతర పరిశీలన,అధికారులతో అవినాభావ సంబంధాలు,మొక్క వోని పోరాట పటిమ, నిర్మోహమాటమైన యదార్థత, ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరింపు,కులమతాలకు అతీతమైన విశాల దృక్పథం పార్టీ పట్ల అచంచలమైన భక్తి మాట తప్పని మడమతిప్పని అభ్యుదయం,ఈ విశిష్టమైన గుణగణాలను ప్రత్యేక ఆభరణాలుగా కలిగి ఒక చరిత్ర సృష్టించిన నాయకుడిగా లక్షలాది మంది హృదయాలలో కూనంనేని అభిమాన సుస్థిర స్థానాన్ని సంపాదించారు.
40 ఏళ్ల నాయకత్వంలో పనిచేసిన డాక్టర్ మద్దెల శివకుమార్ హైదరాబాద్ కళాశాల దశలో పి డి ఎస్ లో రక్త ప్రమాణం చేసి ఈటల రాజేందర్ నాయకత్వంలో పనిచేసి సింగరేణిలో కార్మికుడిగా పనిచేస్తూ యూనియన్ కొమరయ్య అనుచరుడుగా పనిచేసిన నా తండ్రి వామపక్ష భావాలు కలిగిన వాళ్ళమే ఉపాధ్యాయ జేఏసీ చైర్మన్ గా , బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన కళాకారుడిగా బాబా సాహెబ్ అంబేద్కర్ వారసత్వాన్ని పునికి పుచ్చుకున్న దళిత నాయకుడిగా, అప్పటినుండే అన్నతో నా అనుబంధం అజరామరం!
అందుకే గత మూడు నెలలుగా అన్నా మీరు నిశ్చింతగా ఉండండి! గెలుపు మనదే అవుతుంది! సత్యం ధర్మం న్యాయాలదే అవుతుంది! అంతేగాక నేను ఏసుక్రీస్తుప్రభు దేవుడు చెప్పిన కన్నీటితో ప్రార్థిస్తూ మొర పెడుతున్నాను. గెలుపు మనదే కావాలని నేను నేరుగా దేవుడితో ప్రతిరోజు మాట్లాడతానుఆయనే నాకు అండ దండ కొండ గైడ్ అండ్ ఫిలాసఫర్ ఆజ్ఞలను సిద్ధాంతాలను అబిష్టాలను నెరవేర్చుకుంటూ పోతారో వారి మనవిని వారి ప్రార్థనను తప్పకుండా దేవుడు ఆలకించి అంగీకరించి నెరవేరుస్తాడు,
నేను దేవుడి ఆలోచనలను ఆజ్ఞలను అభిష్టాలను సిద్ధాంతాలను అనునిత్యం అన్నివేళలా క్రియా రూపంలో ఆచరిస్తూ అమలుపరిచే దేవుని అసలు సిసలైన సైనికుణ్ణి పేద వర్గాల కోసం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల సాధన కోసం అనునిత్యం నేను పోరాడుతూనే ఉంటాను.కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధిలో కూనంనేనికి నీడగా తోడుగా వారసుడిగా,అసలు సిసలైన అచ్చమైన స్వచ్ఛమైన నాయకుడిగా కోవిడ్ ఉపద్రవం సైతం అలుపెరుగక
మృతదేహాలను దగ్గరుండి అంత్యక్రియలు జరిపించిన మేరు నగధీరుడు,నిత్య కృషివలుడు నిరంతర సేవా తత్పరుడు నాకు అత్యంత ప్రియమైన తమ్ముడు, యదార్థవాది ఎస్. కె సాబీర్ పాషా ఈ శుభ సందర్భంలో మనందరి తరఫున మరియు కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలందరి తరఫున హృదయపూర్వక శుభాభినందనలుతెలియజేశారు.
అలుపెరుగని కార్మికుడిగా సుఖమెరుగని శ్రామికుడిగా నిరంతరం ప్రజా శ్రేయస్సు కోసం సామాజిక చైతన్యం కోసం పనిచేస్తున్న కూనంనేని
ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో కుటుంబ సభ్యులందరితో వందేళ్లు కాదు వెయ్యేళ్లు జీవించాలి!పేద వర్గాలకు కార్మిక కర్షక కూలీ వర్గాలకు బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడి చేయూతనివ్వాలి సమ సమాజ స్థాపన కోసం ఉద్యమించాలికుల రహిత సమాజం కోసం పాటుపడాలి అన్నారు. ఈ సందర్భంగా
ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నాయకులు మరియు మాజీ మెజిస్ట్రేట్ శాంతిరాం,షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బొమ్మెర శ్రీనివాస్,గాంధీ పదం చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు చింతల చెరువు గిరీశం,మాజీ ఐటిఐ ప్రిన్సిపల్ మల్లేష్ ఈదునూరి ఆంజనేయులు,సలిగంటి కొమరయ్య, రజిని అంబేద్కర్ బుద్ధ, ప్రేమ్ కుమార్ తదితరులుపాల్గొన్నారు.
ఎమ్మెల్యే కూనంనేని కోర్టులో గెలుపు సత్యం,ధర్మం,న్యాయం గెలిచింది
