Site icon PRASHNA AYUDHAM

బిజెపి జాతీయ నాయకులతో కలిసి ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రచారం..

IMG 20241112 WA0055

బిజెపి జాతీయ నాయకులతో కలిసి ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రచారం..

మహారాష్ట్రలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఆదిలాబాద్ శాసనసభ్యులు పాయల్ శంకర్ జాతీయ నాయకులతో కలిసి హింగన్ ఘాట్ లో పాల్గొన్నారు. ఈనెల 20న మహారాష్ట్రలో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.బిజెపి జాతీయ ఆర్గనైజింగ్ సెక్రటరీ బిఎల్ సంతోష్ తో వార్డా ఎన్నికల ఇంచార్జ్ పాయల్ శంకర్ భేటీ అయ్యారు. ప్రచార సరళి గురించి వివరించారు. శక్తి కమిటీలు, బూత్ కమిటీల నిర్మాణం, పార్టీ మేనిఫెస్టో గురించి కార్యకర్తలకు వివరించారు. కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ బిజెపి విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బిఎల్ సంతోష్ గారు ఎమ్మెల్యేకు వివరించారు. వార్డా లో బిజెపి అభ్యర్థి గెలుపు ఖాయమని ఎమ్మెల్యే వివరించారు. జాతీయ నాయకుల రాకతో బిజెపి ప్రచారం మరింత ఉద్ధృతమైంది.

Exit mobile version