ధాన్యం కొనుగోలు కేంద్రంన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పోచారం

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం చేసిన అధికారులు..

 

కామారెడ్డి జిల్లా బాన్సువాడ 

ప్రశ్న ఆయుధం అక్టోబర్ 17:

 

బాన్సువాడ రూరల్ మండలం బుడ్మి పీ.ఏ.సీ.ఎస్. పరిది తాడ్కొల్ గ్రామంలో, బిర్కూర్ మండలం బిర్కూర్ పీ.ఏ.సీ.ఎస్.

పరిది బిర్కూర్ గ్రామం,బరంగ్ఎడ్గి గ్రామాలలో, వర్ని మండలం హమ్నాపూర్  

పీ.ఏ.సీ.ఎస్. పరిది హుమ్నాపూర్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి,ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు,

పాల్గొన్న సబ్ కలెక్టర్ కిరణ్మయి

ఈ సందర్బంగా పోచారం మాట్లాడుతూ.తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఎటువంటి నష్టం జరగకూడదు అని రైతు పండించిన ప్రతీ గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని వాన కాలం పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తూ,ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రైతులు పండించిన సన్నం రకం దాన్యాన్నికి ప్రోత్సహకంగా క్వింటాలుకు 500/- బోనస్ ఇవ్వడం జరుగుతుంది

కావున రైతులు సద్వినియోగ పరచుకోవాలని, రైతులు దళారులకు తక్కువ ధరకు అమ్ముకుని నష్టపోకూడదు అని ప్రభుత్వం ఏ గ్రేడ్ ధాన్యానికి 2320/- రూపాయలకు,కామన్ గ్రేడ్ 2300/- రూపాయలకు కొనుగోలు చేస్తుందని, రైతులు శుభ్రం చేసి పొల్లు లేకుండా,తేమ 17% లోపు ఉండేల కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని తెలియజేసారు..

ఈ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల అధ్యక్షుడు ప్రజాప్రతినిధులు, నాయకులు,అధికారులు,రైతులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now