కిషన్‌రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన ఎమ్మెల్యే రాజాసింగ్

*కిషన్‌రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన ఎమ్మెల్యే రాజాసింగ్*

హైదరాబాద్: కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలపై బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. పార్టీలో అందరికీ తగిన గౌరవాన్ని ఇస్తూ, ఈ విషయంపై తాను నేరుగా స్పందించాలనుకుంటున్నానని తెలిపారు. తన ఉద్దేశ్యం ఎప్పుడూ సరళంగా, నిష్కల్మషంగా ఉంటుందని తెలిపారు. ఇవాళ(మంగళవారం) ఓ ప్రకటనను రాజాసింగ్ విడుదల చేశారు.

పార్టీలోని ప్రతి ఒక్కరూ బాగుపడాలి, తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలనేది తన లక్ష్యమని రాజాసింగ్ ఉద్ఘాటించారు. తానేప్పుడూ వ్యక్తిగత లబ్ధి లేదా పదవుల కోసం పని చేయలేదని స్పష్టం చేశారు. తన కృషి ఎప్పుడూ పార్టీని బలోపేతం చేయడం, పార్టీ ఆదర్శాలను అంకితభావంతో పనిచేయడంపైనే తాను దృష్టి పెట్టానని అన్నారు. అయితే, తెలంగాణలోని అన్ని 119 నియోజకవర్గాల్లో బీజేపీ పార్టీ ఎలా విజయం సాధించడానికి బదులుగా, తనను మాత్రమే లక్ష్యంగా చేసుకొని, తనను విడదీసి, అడ్డంకులు సృష్టిస్తున్నారని.. అయినప్పటికీ తాను పార్టీకి అంకితమైన, నిస్వార్థ సేవ చేశానని చెప్పారు రాజాసింగ్.

ఒక పార్టీ కార్యకర్తను ఇబ్బంది పెడితే ఏం లాభమని రాజాసింగ్ ప్రశ్నించారు. తాను ఎప్పుడూ పార్టీకి అనుకూలంగా నిలబడ్డానని గుర్తుచేశారు. ఈ రోజు తాను తన కోసం కాకుండా, పార్టీ ఐక్యతకు, అదే ఉద్దేశ్యంతో పనిచేస్తున్న లక్షలాది కార్యకర్తల మనోబలాన్ని కాపాడుకోవటం కోసం మాట్లాడుతున్నానని స్పష్టం చేశారు. కిషన్‌రెడ్డి తమకు కొంత సమయం కేటాయించాలని కోరారు. తాను, పార్టీ సహచరులు మీతో వ్యక్తిగతంగా కలిసి, తమ సమస్యలను మీ దృష్టికి తీసుకువస్తామని చెప్పారు. కిషన్‌రెడ్డి ఎక్కడైనా, ఎప్పుడైనా సమావేశం నిర్ణయిస్తే తాము రావడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. తాము పార్టీని విభజించడానికి కాదని, ఐక్యతను తీసుకురావడానికి కృషి చేస్తామని అన్నారు. పార్టీ నిజమైన లక్ష్యాన్ని మనం మరచిపోకూడదని చెప్పారు. తెలంగాణకు బీజేపీ ప్రభుత్వం అవసరమని అన్నారు. వ్యక్తిగత విభేదాలను విడిచిపెట్టి, ఐక్యంగా పని చేద్దామని రాజాసింగ్ కోరారు..

Join WhatsApp

Join Now

Leave a Comment