జగన్నాధుని మారు రథయాత్రలో ఎమ్మెల్యే విజయ్ చంద్ర.
పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి జులై 6 ( ప్రశ్న ఆయుధం న్యూస్ ) దత్తి మహేశ్వరరావు
పార్వతీపురం : పార్వతీపురం పట్టణంలో జగన్నాథ స్వామి మారు రథయాత్ర శనివారం అంగరంగ వైభవంగా సాగింది. ఎమ్మెల్యే యాత్రలో పాల్గొని జగన్నాథ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర రథం లాగి యాత్రను పున: ప్రారంభించారు. భక్తులతో కలిసి రధాన్ని లాగి భక్తి భావాన్ని చాటుకున్న ఎమ్మెల్యే విజయ్ చంద్ర స్థానిక యువతను భక్తి మార్గం వైపు నడవాలని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు