శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి విగ్రహాల ప్రతిష్టలో పాల్గొన్న ఎమ్మెల్యే విజయచంద్ర 

శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి విగ్రహాల ప్రతిష్టలో పాల్గొన్న ఎమ్మెల్యే విజయచంద్ర

పార్వతీపురం మన్యం జిల్లా ప్రతినిధి మే 8( ప్రశ్న ఆయుధం న్యూస్) దత్తమహేశ్వరరావు

పార్వతీపురం మండలం లక్ష్మీనారాయణపురం గ్రామంలో వెలసిన శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయంలో నూతన విగ్రహాల ప్రశిష్ఠ కార్యక్రమంలో పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్రు పాల్గొన్నారు. ముందుగా ప్రముఖ నాడీ జ్యోతిష్యులు, సర్వమంగళ దేవి పీఠాధిపతి మురపాక కాళిదాసు శర్మ యాజి ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక పూజలలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. వేద మంత్రోచ్ఛరణల మధ్య విగ్రహాల ప్రతిష్ట జరిగింది. అనంతరం ఆలయ కమిటీ వారికి 10,000 రూపాయలు విరాళం అందజేశారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, గ్రామ ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment