డయాలసిస్ యూనిట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని
పాల్గొన్న టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు
పాల్వంచ ప్రభుత్వ వైద్యశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభ కార్యక్రమంలో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో పాటుగా టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు,DCMS చైర్మన్ కొత్వాల.శ్రీనివాసరావు,పాల్వంచ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూకల.రంగారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 70 లక్షల రూపాయలతో పాల్వంచలో 5 బెడ్లతో డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. దీనివల్ల పాల్వంచ ప్రాంతంలోని డయాలసిస్ పేషెంట్లు ఉపయోగించుకునేందుకు ఎంతో సులభంగా ఉంటుందన్నారు.