Site icon PRASHNA AYUDHAM

ప్రజా పాలనలో ప్రభుత్వ సేవలు వినియోగించుకుంటున్న ప్రజలు

ప్రభుత్వ
Headlines in Telugu:

ప్రశ్న ఆయుధం న్యూస్ దమ్మపేట మండల ప్రతినిధి అక్టోబర్ 30

ముస్లిం మైనార్టీలకు అండగా నిలబడతా ఎమ్మెల్యే జారే

దమ్మపేట మండలం గండు గులపల్లి క్యాంపు కార్యలయంలో
ముస్లిం మైనారిటీలు నియోజకవర్గ వ్యాప్తంగా ఎదుర్కొంటున్న సమస్యలు అలాగే త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం అందించబోయే ఇందిరమ్మ ఇండ్లలో ముస్లిం మైనారిటీలలో అర్హులైన వారికి లబ్ధి చేకూరేలా చూడాలని ముస్లిం మైనారిటీలకు అన్యాయం జరగకుండా ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని ఎమ్మెల్యే కి మైనారిటీ ప్రధాన కార్యదర్శి సయ్యద్ సర్ధార్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందించారు. ముష్టిబండ గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న మసీద్ నిర్మాణానికి సహకరించాలని అలాగే నియోజకవర్గ వ్యాప్తంగా శిదిళావస్థలో ఉన్న మసీద్ లు షాదీఖానాలు అభివృద్ధికి నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే ని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముస్లిం మైనారిటీల అభివృద్ధికి కృషి చేస్తానని మైనారిటీల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని అలాగే ముష్టిబండలో నూతనంగా నిర్మించే మసీదు నిర్మాణానికి సహకరిస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట నియోజకవర్గ మైనారిటీ ప్రధాన కార్యదర్శి సయ్యద్ సర్దార్ , జిల్లా నాయకులు షేక్ గఫార్ , దస్తగీర్ , జానీ మియా, హబీబ్ ఎన్ ఎస్ యు ఐ నాయకులు షేక్ బాజీ బాబు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version