*ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డికి పట్టభద్రులు అండ*
*బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్ రావు*
*జమ్మికుంట ఫిబ్రవరి 19 ప్రశ్న ఆయుధం*
భారతీయ జనతా పార్టీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డికి పట్టభద్రులు అండగా ఉంటారని బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్ రావు ఆశాభావం వ్యక్తం చేశారు జమ్మికుంట మున్సిపల్ పరిధిలో బుధవారం రోజున అంజిరెడ్డి గెలుపు కోసం బిజెపి శ్రేణులు పట్టభద్రులను కలిసి ఓటు అభ్యర్థించారు. అనంతరం బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్ రావు మాట్లాడుతూ అంజిరెడ్డి సేవా భావంతో ఎస్ ఆర్ అనే స్వచ్ఛంద సంస్థను నెలకొల్పి అనేక మంది పేద విద్యార్థులకు దుస్తులు,పుస్తకాలు కొనిచ్చాడని సౌకర్యాలు లేక మూతబడుతున్న స్కూళ్లకు లక్షలాది రూపాయలు వెచ్చించి ఫర్నిచర్,ఇతర సౌకర్యాలు కల్పించి ఆదుకున్నాడని తెలిపారు. బస్టాండ్లు,దేవాలయాలు,ప్రజలు అత్యధికంగా సంచరించే ప్రదేశాల్లో వాటర్ ప్యూరిఫయర్ మిషన్లు ఏర్పాటుచేసి వేలాది మంది ప్రజల ఆరోగ్యాలను కాపాడడానికి ప్రయత్నం చేశాడని కొనియాడారు. గత 20 సంవత్సరాలుగా నిరుద్యోగ యువతీ యువకులకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి ఎంతోమంది యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాడని, కరోన సమయంలో కోట్లాది రూపాయల నిత్యవసర వస్తువులు, సానిటైజర్లు ఉచితంగా పంపిణీ చేసాడని గొప్ప సేవా బావం కలిగిన వ్యక్తి అంజిరెడ్డి అని కితాబిచ్చాడు.అనేక రకాల హామీలతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను విస్మరించి ప్రజలను మోసం చేసిందని దుయ్యబట్టాడు. ముఖ్యంగా నిరుద్యోగులకు అవకాశాలు కల్పించడంలో, వారిని ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని మండిపడ్డాడు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్తూ ప్రపంచంలో భారతదేశానికి గుర్తింపు తెచ్చే విధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం పనిచేస్తుందని కొనియాడారు. నరేంద్ర మోడీకి మద్దతుగా పట్టభద్రులు అంజిరెడ్డి కి ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని పట్టభద్రులను కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జమ్మికుంట పట్టణ మాజీ అధ్యక్షుడు జీడి మల్లేష్, బిజెపి నాయకులు పల్లపు రవి,కొమ్ము అశోక్,రాచపల్లీ ప్రశాంత్, శ్రీవర్తి ప్రవీణ్,జోరుక శ్రీనివాస్,శ్రివర్తి అఖిల్ తదితరులు పాల్గొన్నారు.