Site icon PRASHNA AYUDHAM

ఎమ్మెల్సీ ఎన్రోల్మెంట్ ఇంచార్జ్ ప్రవీణ్ రెడ్డి

ఇంచార్జ్

జిల్లా బిజెపి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్రోల్మెంట్ ఇంచార్జ్ గా నరెడ్ల ప్రవీణ్ రెడ్డి

కరీంనగర్ అక్టోబర్ 22 ప్రశ్న ఆయుధం)

మార్చి 2025 లో జరగబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కరీంనగర్ జిల్లా బిజెపి పట్టభద్రుల ఎన్రోల్మెంట్ ఇంచార్జ్ గా నరెడ్ల ప్రవీణ్ రెడ్డి నియమితులయ్యారు ఈ మేరకు మంగళవారం రోజున బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి నియామకపు ప్రకటన చేశారు హుజురాబాద్ మండలం చిన్న పాపయ్య పల్లి గ్రామానికి చెందిన నరెడ్ల ప్రవీణ్ రెడ్డి పది సంవత్సరాలు ఏబీవీపీ ఫుల్ టైమర్ గా జాతీయ కార్యవర్గ సభ్యుడిగా తదనంతరం బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పని చేశారు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మంచిర్యాల అసెంబ్లీ ప్రభారీగా పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ పశ్చిమ అసెంబ్లీ ప్రభారీగా పని చేశారు నరెడ్ల ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల కోసం పట్టభద్రుల ఎన్రోల్మెంట్ ఇన్చార్జిగా తనకు అవకాశం కల్పించిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కి బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి కి,బీజేపీ శ్రేణులు అందరికీ ధన్యవాదాలు తెలిపారు.ఎమ్మెల్సీ ఎన్నికల ల్లో పట్టభద్రుల ఎన్రోల్మెంట్ కోసం పూర్తి సమయం కేటాయించి పని చేస్తానని ఆయన తెలిపారు.

Exit mobile version