Site icon PRASHNA AYUDHAM

ప్రజా అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయం: ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు.

IMG 20250202 WA0069

*ప్రజా అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయం: ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు.*

*ప్రశ్న ఆయుధం ఫిబ్రవరి 02:కుత్బుల్లాపూర్ ప్రతినిధి*

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ శంభీపూర్ లోని కార్యాలయంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు,ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసారు.

ఈ సందర్భంగా పలు సమస్యలు పరిష్కరించాలని విన్నవించారు. వారు సానుకూలంగా స్పందించి ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. అదేవిధంగా పలు కార్యక్రమాలలో పాల్గొనాలని ఆహ్వాన పత్రికలను అందజేశారు.

Exit mobile version