Site icon PRASHNA AYUDHAM

న్యూఢిల్లీలో జాతీయ అవార్డు అందుకున్న శ్రీవిద్య పాఠశాల నిర్వాహకులు మోహన్ రెడ్డి

IMG 20241216 WA0166

ప్రశ్న ఆయుధం న్యూస్ డిసెంబర్ 16 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి
న్యూఢిల్లీలో అత్యంత ప్రతిష్టాత్మక బెస్ట్ సర్వీస్ సొసైటీ జాతీయ అవార్డు అందుకున్న మణుగూరు శ్రీ విద్యాభ్యాస పాఠశాల నిర్వాహకులు బి జగన్మోహన్ రెడ్డి
రెడ్డి కి పలువురి శుభాకాంక్షలు
బహుజన సాహిత్య అకాడమీ వారు న్యూఢిల్లీ ఆంధ్ర అసోసియేషన్ భవన్ లో నిర్వహించిన నేషనల్ కాన్ఫరెన్స్ లో మణుగూరుకు చెందిన శ్రీ విద్యాభ్యాస (పూర్వ బాలవెలుగు) పాఠశాల నిర్వాహకులు బండ జగన్ మోహన్ రెడ్డి కి ముఖ్య అతిధులు దివంగత జాతీయ నేత కాన్షీ రామ్ సోదరీమణి బీబీ స్వరణ్ కౌర్ జీ , ఢిల్లీ శాసనసభ్యులు వికేష్ రవి జి, మునీర్ సింగ్ పచ్చ మరియు అతిథులు ఆహ్వానితుల నడుమ అత్యంత ప్రతిష్టాత్మక “బెస్ట్ సర్వీస్ సొసైటీ జాతీయ అవార్డును అందజేశారు.
ఈ సందర్భంగా బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ మాట్లాడుతూ ఎస్ సి, ఎస్ టీ, బీసీ మరియు మైనార్టీల సాహిత్యాన్ని ముందుకు తీసుకుపోవటం కోసం బహుజన సాహిత్య అకాడమీ వారు ప్రతి ఏటా ప్రజా ఉద్యమకారులకు, సంఘ సేవకులకు, సామాజిక కార్యకర్తలకు , రచయితలకు, కవులకు మరియు స్వచ్ఛంద సంస్థలకు ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ అవార్డులను అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ కు దేశవ్యాప్తంగా ఇరవై ఏడు రాష్ట్రాల నుండి సుమారు వెయ్యి మంది ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారని రాధాకృష్ణ తెలిపారు.అవార్డు గ్రహీత బి జగన్మోహన్ రెడ్డి సేవలను ప్రత్యేకించి మణుగూరు సమీప గ్రామాలలోని వలస గొత్తి కోయల విద్యార్థులను, నిరుపేద గిరిజనుల గిరిజనేతరుల ,విద్యార్థిని విద్యార్థులను, బాల కార్మికులను చేరదీసి వారికి వసతి సౌకర్యంతో పాటు విద్యాబుద్ధులు నేర్పించి ప్రభుత్వ ప్రవేశ పరీక్షల ద్వారా ఉత్తీర్ణులైన విద్యార్థినీ విద్యార్థులను గురుకుల పాఠశాలలో చేర్పించి వారి ఉన్నతికి పాటుపడుతున్న రెడ్డి నిస్వార్ధ సేవలను గుర్తించి అత్యంత ప్రతిష్టాత్మక బెస్ట్ సర్వీస్ సొసైటీ జాతీయ అవార్డును ప్రశంస పత్రాన్ని అందజేయడంతో పాటు అతిథుల చేత సత్కరించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత బి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఈ జాతీయ అవార్డు తనలో ఆత్మస్థైర్యాన్ని, బాధ్యతలను మరింత పెంచిందని ఈ ప్రోత్సాహంతో చదువుకు దూరమైన మరి ఎంతోమంది పేద విద్యార్థులకు మరింత చేరువయ్యే విధంగా తన సేవలను మరింత విస్తృతపరిచే విధంగా వారి ఉన్నతికి శ్రీ విద్యాభ్యాస బృందం మరింత కృషి చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. అవార్డును ప్రకటించి తను ఎంతగానో ప్రోత్సహించిన బహుజన సాహిత్య అకాడెమీ సంస్థకు జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ కి, సిఫారసు చేసిన జిల్లా అధ్యక్షురాలు నల్లా జ్యోతికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.అవార్డును తన అమ్మానాన్నలకు అంకితం ఇస్తున్నట్లుగా జగన్మోహన్ రెడ్డి విలేకరులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ యు సుబ్రమణియన్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎం ఎం గౌతమ్, సిద్ధార్థ సుమన్, ఏ ప్రవీణ్,రాష్ట్ర కోఆర్డినేటర్ హనుమాండ్ల విష్ణు, మరియు అవార్డు సెలక్షన్ కమిటీ సభ్యులు రాష్ట్ర కార్యదర్శి నల్లా జ్యోతి, రెడ్డి గారి బంధువు కిరణ్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version