వ్యవసాయ రంగంలో మరిన్ని పరిశోధనలు జరగాలి

వ్యవసాయ కళాశాలను ఆదర్శంగా తీర్చిదిద్దుతా
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ప్రశ్న ఆయుధం న్యూస్ డిసెంబర్ 13 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి
రైతులకు వ్యవసాయపరంగా అన్ని విధాల మేలు జరిగేలా వ్యవసాయ విద్యలో మరిన్ని పరిశోధనలు చేపట్టాల్సిన అవసరం ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శనివారం అశ్వరావుపేటలోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ కళాశాల డైమండ్ జూబ్లీ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వ్యవసాయ కళాశాలలో సాగు చేస్తున్నటువంటి మియాజాకి మామిడి సాగును, ఇతర పంటల సాగును పరిశీలించారు. వ్యవసాయ కళాశాల ప్రిన్సిపల్ హేమంత్ చేపట్టే సాగు మరియు వినూత్న ప్రయోగాలు గురించి మంత్రికి వివరించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వ్యవసాయ కళాశాల కేవలం విద్యార్థులకు బోధన అందించడం మాత్రమే కాకుండా రైతులకు ఉపయోగపడేలా వినూత్న రీతిలో సాగు చేయు పంటలు మరియు రైతులకు ఆదాయం వచ్చే పంటల సాగు చేపట్టాలన్నారు. అశ్వరావుపేటలో ఆనాటి ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు ఆలోచనలతో ఇక్కడ వ్యవసాయ కళాశాల ఏర్పాటుకు అంకురార్పణ జరిగిందన్నారు. ఈ ఈ ప్రాంతంతో పాటు ఇక్కడ రైతాంగాన్ని వ్యవసాయపరంగా మరింత ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇక్కడ వ్యవసాయ కళాశాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. అశ్వరావుపేట వ్యవసాయ కళాశాల ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిందని, 35 ఏళ్ల ప్రస్థానంలో 2,500 మంది వ్యవసాయ విద్యార్థులు ఇక్కడ నుంచే తయారయ్యారని గుర్తు చేశారు. ఇక్కడ నుంచి బయటకు వెళ్తున్న విద్యార్థులు వ్యవసాయ పరమైన రంగాల్లో రైతులకు అవగాహన కల్పిస్తూ అండగా నిలవాలని సూచించారు. వ్యవసాయ కళాశాల నా చిరకాల కలల పంట అని ఇతర వ్యవసాయ కళాశాలలకు దీటుగా ఈ కళాశాలను తీర్చిదిద్దడమే తన చిరకాల వాంఛ అని అన్నారు. దీనికోసం కళాశాల పూర్తిస్థాయి అభివృద్ధి కోసం అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేయాలన్నారు. పంటలకు వాల్యూయేటెడ్ రావాలంటే ప్రాసెసింగ్ ప్లాంట్లను ఎక్కువ సంఖ్యలో నెలకొల్పాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం పామాయిల్ మొక్కల నుంచి బై ప్రొడక్ట్స్ పరిశోధనలు విస్తృతంగా జరగాలని ఆయన అన్నారు. భవిష్యత్తులో కలెక్టర్, ఎస్పీల కంటే పామాయిల్ రైతులు ఎక్కువ ఆదాయాన్ని రాబట్టే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం వరి పంటలో నెంబర్ వన్ గా నిలుస్తోందని ప్రభుత్వం వరి రైతులను మరింతగా ప్రోత్సహిస్తూ ప్రస్తుతం బోనస్ ను సైతం అందిస్తుందని అన్నారు. గిరిజన ప్రాంతాల్లో రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేలా అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అశ్వరావుపేట కళాశాలలో ఆధునిక మౌలిక వసతుల కల్పనకు పూర్తి బాధ్యత తనదేనని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు.
అశ్వరావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ మాట్లాడుతూ మాది ఒక రైతు కుటుంబం అని అన్నారు. 1989లో గొప్ప సంకల్పంతో ఈ వ్యవసాయ కళాశాలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి సహకారంతో ఆనాడు ప్రారంభించి, ఎంతోమంది గొప్ప గొప్ప శాస్త్రవేత్తలను తయారుచేసిందన్నారు. వ్యవసాయ కళాశాల విద్యార్థులు ఆ శాస్త్రవేత్తలను ఆదర్శంగా తీసుకొని నూతన పద్ధతుల ద్వారా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పరచాలన్నారు.అశ్వరావుపేట నియోజకవర్గం లో వ్యవసాయ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు మరియు ములకలపల్లి మండలంలో ఫ్యాక్టరీ స్థాపనకు కృషి చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ని కోరారు. ఈ సందర్భంగా చెట్ల యొక్క ప్రాముఖ్యత తెలిపే పాటను పాడి విద్యార్థుల్లో ఉత్సాహాన్ని పెంపొందించారు.
నిజమైన రాజు అంటే రైతేనని, సామ్రాజ్యం అంటే పంట అని అన్నారు.వ్యవసాయంలో సామ్రాజ్యం అంటే వరి పంట దేనని మేము నూతనంగా మునగ సామ్రాజ్యం నెలకొల్పటానికి ప్రయత్నిస్తున్నామన్నారు. ప్రస్తుతంవ్యవసాయంలో సాగు విస్తీర్ణం తగ్గుతుందని, భూమాత నుండి మనం పంటను తీసుకుంటున్నాం కానీ,కృత్రిమంగా ఉపయోగించు ఎరువులు, పురుగు మందులు వల్ల ప్రజల ఆరోగ్యానికి హాని మరియు భూసారం కూడా తగ్గుతుందని తెలిపారు. వ్యవసాయ కళాశాలలో విద్యార్థులు సేంద్రీయ ఎరువులపై దృష్టి పెట్టి వ్యవసాయ రంగా అభివృద్ధికి కృషి చేయాలని ఆయన సూచించారు.ఐ టి టి ఏ పి ఓ రాహుల్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సాగు విస్తీర్ణం తగ్గుతుందన్నారు. వ్యవసాయ రంగం మీదనే మానవ మనుగడ ఆధారపడి ఉంటుందన్నారు. ప్రతి ఒక్క ఊరులో మిల్లెట్స్ ద్వారా తయారు చేసే ఆహారానికి ప్రస్తుతం ప్రజలు ఇష్టపడుతున్నారు. అశ్వరావుపేట అనేది ఆయిల్ ఫామ్ కి కేంద్రంగా ఉందన్నారు. వ్యవసాయ రంగంలో వినూత్నమైనప్రయోగాల ద్వారానూతన వంగడాల సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమాలు వ్యవసాయ కళాశాల ద్వారా కల్పించాలన్నారు.వ్యవసాయ శాఖ డైరెక్టర్ డాక్టర్ బి గోపి, డాక్టర్ రాజిరెడ్డి హార్టికల్చర్ వైస్ ఛాన్స్లర్, పాల్వంచ డిఎస్పి సతీష్ బాబు వ్యవసాయ కళాశాల పూర్వ విద్యార్థులు, వ్యవసాయ కళాశాల సిబ్బంది మరియు విద్యార్థులు మరియు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now