వాహనదారులు విధిగా హెల్మెట్, సీట్ బెల్టు ధరించాలి. అవగాహన ర్యాలీలో జిల్లా జడ్జి, కలెక్టర్..
నిజామాబాద్ (ప్రశ్న ఆయుధం ) జిల్లా ప్రతినిధి జనవరి09
రోడ్డు దుర్ఘటనలలో అత్యధికంగా ద్విచక్రవాహనదారులు ప్రమాదాలకు గురవుతూ ప్రాణాలు కోల్పోతున్నారని, ఎంతోమంది క్షతగాత్రులుగా మారుతున్నారని అన్నారు. హెల్మెట్ ధరించి వాహనాలు నడిపితే దాదాపు 90 శాతం వరకు ప్రాణాపాయం బారి నుండి తమను తాము కాపాడుకునేందుకు ఆస్కారం ఉంటుందని సూచించారు. ప్రతిఒక్కరు హెల్మెట్ ధరించడాన్ని అలవాటుగా చేసుకోవాలని, దీనిని కనీస బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు. ఎదుటివారి వల్ల ప్రమాదాలకు గురైన సందర్భాలలోనూ హెల్మెట్ ప్రాణాపాయ స్థితి నుండి కాపాడుతుందని గుర్తు చేశారు. ప్రమాదాల నియంత్రణ కోసం వాహనాల తనిఖీలు నిర్వహిస్తూ, నిబధనల మేరకు జరిమానాలు విధించడం వంటివి చేస్తున్నప్పటికీ, ఎవరికివారు ట్రాఫిక్ నిబంధనలను విధిగా పాటించినప్పుడే ప్రమాదాలకు కళ్లెం వేయవచ్చని సూచించారు. హెల్మెట్ల వినియోగం అత్యావశ్యకం, సురక్షితం అనే విషయాన్ని ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేందుకు విస్తృత స్థాయిలో కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ప్రమాదాలను నిలువరించేందుకు ప్రతిఒక్కరు బాధ్యతాయుతంగా వాహనాలు నడుపుతూ, తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని హితవు పలికారు.ఈ సదర్భంగా హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న ద్విచ్రక్ర వాహనదారులకు శిరస్త్రాణం ధరించాల్సిన అవశ్యకతను తెలియజేస్తూ, పలువురికి మాణిక్ బండార్ పాఠశాల సౌజన్యంతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా హెల్మెట్ లు అందజేశారు. హెల్మెట్ ధరించి ప్రయాణిస్తున్న వారిని అభినందిస్తూ ముఖ్య అతిథులచే పుష్పగుచ్చాలు బహూకరించారు. అదేవిధంగా గాలిపటాలు ఎగురవేసే సమయంలో ప్రాణాంతకంగా పరిణమిస్తున్న చైనా మాంజాను వినియోగించ కూడదని, దీనిని నిషేధించడం జరిగిందని తెలిపారు. ఛైనా మాంజా నిషేధం గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు వీలుగా ముద్రించిన గోడ ప్రతులను జిల్లా జడ్జి, కలెక్టర్ ఆవిష్కరించారు.
కార్యక్రమంలో అదనపు డీసీపీ బస్వారెడ్డి, సీనియర్ సివిల్ జడ్జి పి.పద్మావతి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కె.గోపికృష్ణ, అదనపు జూనియర్ సివిల్ జడ్జీలు ఖుష్బూ ఉపాధ్యాయ్, పి.శ్రీనివాస్ రావు, డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమినర్ దుర్గాప్రమీల, జిల్లా రవాణా శాఖ అధికారి ఉమా మహేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.